Asin : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరోయిన్లలో ఆసిన్ ఒకరు. ఈమె దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అందులో రవితేజ హీరోగా నటించాడు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో దర్శకుడు పూరీతోపాటు రవితేజ, ఆసిన్లకు మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలోనే ఆసిన్ తరువాత వరుస చిత్రాల్లో నటించింది. ఒక దశలో టాలీవుడ్లో టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది.
ఆ మూవీ విజయం అనంతరం పూరీ ఈమెకు మరో అవకాశం ఇచ్చారు. నాగార్జునతో కలిసి ఈమె శివమణి అనే మూవీలో నటించింది. దీంతో ఈ మూవీ కూడా హిట్ అయింది. ఇక ఆ తరువాత ఆసిన్ వెనుకకు తిరిగి చూడలేదు. వరుసగా అగ్ర హీరోలు అందరితోనూ సినిమాలు చేస్తూ వెళ్లింది. బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్తో ఘర్షణ, పవన్ కల్యాణ్తో అన్నవరం.. వంటి సినిమాలు చేసింది. అలాగే హీరో సూర్య పక్కన గజిని అనే మూవీలో నటించింది. ఈ మూవీ కూడా హిట్ అయింది. ఇలా ఆసిన్ రేంజ్ అప్పట్లో పెరిగిపోయింది.
అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆసిన్ వివాహం చేసుకుంది. రాహుల్ శర్మ అనే వ్యాపారవేత్తను ఈమె 2016లో వివాహమాడింది. ఈ క్రమంలో ఈమెకు సంతానం కూడా కలిగింది. ఒక కుమార్తె ఉంది. అయితే పెళ్లి అయిన తరువాత కూడా చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. కానీ ఆసిన్ మాత్రం ఎలాంటి సోషల్ ఖాతాలను మెయింటెయిన్ చేయడం లేదు. అయితే తాజాగా ఈమె ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో మెరిసింది. దీంతో ఈమెకు చెందిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఆసిన్ గుర్తు పట్టలేని విధంగా ఉంది.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…