Heat Stroke : వేసవి కాలం.. ఈ సీజన్లో సహజంగానే మన శరీరం వేడిగా ఉంటుంది. ఇక వేడి పదార్థాలు, నూనెతో తయారు చేసిన ఆహారాలను తింటే.. శరీరంలో వేడి ఇంకా ఎక్కువవుతుంది. అలాగే బయట ఎక్కువగా తిరిగినా కూడా శరీరం వేడిగా మారుతుంది. దీంతో ఎండ దెబ్బ బారిన కూడా పడతారు. శరీరం వేడిగా మారితే మూత్రంలో మంట.. విరేచనాలు.. వంటి సమస్యలు వస్తాయి. అయితే ముందుగానే జాగ్రత్త పడితే ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అందుకు గాను శరీరాన్ని చల్లబరుచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో వేడి సహజంగానే తగ్గుతుంది. ఇక శరీరాన్ని చల్లబరిచేందుకు పలు ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే..
రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ దానిమ్మ పండ్ల రసం తాగాలి. ఇది శరీరాన్ని చల్లగా మారుస్తుంది. రోజంతా చల్లగా ఉంచుతుంది. అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఒక్క గ్లాస్ చొప్పున కొబ్బరినీళ్లను తాగాలి. దీని వల్ల కూడా శరీరం చల్లగా ఉంటుంది. ఇక ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీని వల్ల కూడా శరీరంలోని వేడి తగ్గుతుంది.
రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ గసగసాల పొడిని కలిపి తాగినా కూడా శరీరం చల్లగా ఉంటుంది. దీంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తినవచ్చు. లేదా ఒక గ్లాస్ తర్బూజా జ్యూస్ తాగవచ్చు. ఇవన్నీ శరీరంలోని వేడి తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. దీంతో వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…