Money : డబ్బు సంపాదించడం అన్నది ప్రస్తుత తరుణంలో ఎంతటి కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించలేక చాలా మంది ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పులు చేస్తున్నారు. దీంతో అవి తీర్చలేక మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కొందరు డబ్బు సంపాదిస్తున్నారు. కానీ చేతిలో డబ్బు నిలవడం లేదని వాపోతున్నారు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చవుతుందని విచారిస్తుంటారు. కానీ ఈ సమస్యలకు ఇంట్లో వాస్తు దోషం కూడా కారణమవుతుంది. అలాగే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా ఉండాలి. అది లేకపోయినా ఆర్థిక సమస్యలు వస్తాయి. మరి లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
సాధారణంగా చాలా మంది ఇళ్లలో వివిధ రకాల పూలమొక్కలను పెంచుతుంటారు. వాటిల్లో సన్నజాజి మొక్క ఒకటి. చాలా మంది ఇళ్లలో ఈ మొక్క ఒక్కటే ఉంటుంది. కానీ దీంతోపాటు విరజాజి అనే మొక్క కూడా ఉంటుంది. దీన్ని కూడా ఇంట్లో పెంచాలి. ఈ రెండు మొక్కలనూ లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావిస్తారు. కనుక ఇంట్లో సన్నజాజి మొక్కను పెంచుతున్న వారు దాంతోపాటు విరజాజి మొక్కను కూడా పెంచాల్సి ఉంటుంది. దీంతో లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఇక పైన తెలిపిన రెండు మొక్కలతోపాటు ఇంటి పెరట్లో తులసి మొక్కను కూడా పెంచాలి. తులసి సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. కనుక సన్నజాజి, విరజాజి, తులసి మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. దీంతో ఆర్థిక సమస్యలన్నీ పోతాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది.
ఇక ఈ మొక్కలకు చెందిన పువ్వులను కోసి సాయంత్రం సమయంలో మాలగా చేసి లక్ష్మీ నారాయణుల చిత్రపటాలు లేదా విగ్రహాలపై వేయాలి. తరువాత పూజ లేదా దీపారాధన చేయాలి. కనీసం రెండు అగరువత్తులను అయినా వెలిగించాలి. ఇలా పూలను మాలగా తయారు చేసి దాన్ని వేసి పూజ చేసే వరకు ఏదైనా ఒక కోరికను బలంగా కోరుకుంటూ ఉండాలి. ఇలా రోజూ చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మనపై కలుగుతుంది. దీంతో ఆర్థిక సమస్యలు పోయి డబ్బును బాగా సంపాదిస్తారు. ఇలా ధనాన్ని పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…