Garikapati Narasimha Rao : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన తాజా చిత్రం.. పుష్ప. ఈ సినిమా అనేక మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే త్వరలో ఈ మూవీకి రెండో పార్ట్ను తెరకెక్కించనున్నారు. అయితే ఈ మూవీని ఎందరు పొగుడుతున్నారో.. అందరు విమర్శిస్తున్నారు. విమర్శిస్తున్నవారిలో ప్రముఖ సహస్ర అవధాని గరికపాటి ఒకరు.
సహస్ర అవధాని గరికపాటి నరసింహా రావు తాజాగా పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్, సుకుమార్లను ఆయన ఏకిపారేశారు. ఆ ఇద్దరూ తన దగ్గరకు వస్తే కడిగి పారేస్తానని అన్నారు. ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారని ప్రశ్నించారు. స్మగ్లింగ్ను ప్రోత్సహించేలా ఈ సినిమా ఉందని.. దీన్ని చూసి సమాజంలో మనుషులు చెడిపోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు.
స్మగ్లింగ్ను, రౌడీయిజాన్ని ప్రోత్సహించడం.. రోడ్డు మీద పోయేవాళ్లను చెంప దెబ్బ కొట్టి తగ్గేదేలే.. అనడం ఎంత వరకు కరెక్ట్ అని అన్నారు. రాముడు, హరిశ్చంద్రుడు లాంటి వారు అలాంటి డైలాగ్లు వాడాలి కానీ.. స్మగ్లర్లు ఎలా వాడుతారని.. అలాంటి వారిని ప్రోత్సహిస్తూ అసలు సినిమాలు ఎలా తీస్తారని గరికపాటి ప్రశ్నించారు.
ఇక ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు ర్యాంకులు రావాలని ఆశిస్తున్న తల్లిదండ్రుల మనస్తత్వంపై కూడా ఆయన విమర్శలు చేశారు. తమ పిల్లలు అబద్దాలు చెప్పినా ఫర్వాలేదు కానీ వారికి ర్యాంకులు మాత్రం రావాలని ప్రస్తుతం తల్లిదండ్రులు కోరుకుంటున్నారని.. అలాంటి తల్లిదండ్రులు పిల్లలు సన్మార్గంలో ఎలా నడిపిస్తారని అన్నారు. పిల్లలకు కావల్సింది ర్యాంకులు కాదని, మంచి ప్రవర్తన, నీతి నిజాయితీ, సంస్కారం ఉండాలని.. వాటిని పిల్లలకు నేర్పాలని హితవు పలికారు.
కాగా గరికపాటికి ఇటీవలే కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం విదితమే. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా మాట్లాడారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…