Ganesh Murugan : మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక మంది అనేక రకాల మనస్తత్వాలతో ఉంటారు. కొందరు తాము చేస్తున్న పని నచ్చడం లేదని చెబుతుంటారు. ఇక కొందరు తమకు నచ్చిన పని దొరకడం లేదని ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కొందరు జులాయిగా తిరుగుతూ ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ జల్సాలు చేస్తుంటారు. ఇలా అనేక రకాల వ్యక్తులు మనకు తారస పడుతుంటారు. అయితే ఇలాంటి వారందరికీ అతను ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రమాదం కారణంగా కాళ్లు పనిచేయకపోయినా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. తనకు దొరికిన పని చేస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
చెన్నైకి చెందిన గణేష్ మురుగన్ వయస్సు 37 ఏళ్లు. అతను జొమాటోలో ఫుడ్ డెలివరీ చేస్తూ కాలం వెళ్లదీస్తుండేవాడు. అయితే ఒకసారి ట్రక్కు ఢీకొని అతని వెన్నెముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీంతో కింది భాగం మొత్తం పనిచేయకుండా పోయింది. అతని కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవలేకపోయాడు. ఇది 6 ఏళ్ల కిందట జరిగింది.
అయితే అంతటి ప్రమాదం బారిన పడి నడవరాకుండా అయిపోయినా.. అతను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. కష్టపడి పనిచేసేందుకు నడుం బిగించాడు. అందులో భాగంగానే ఐఐటీ మద్రాస్ వారి సహకారంతో ఒక వీల్ చెయిర్ను తీసుకుని దాంతో ఫుడ్ డెలివరీలు చేయడం మొదలు పెట్టాడు. ఆ వీల్ చెయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లా పనిచేస్తుంది. అందులో బ్యాటరీ ఉంటుంది. నాలుగు గంటల పాటు చార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్లు వెళ్లవచ్చు.
ఇలా గణేష్ తాను వైకల్యం బారిన పడ్డాననే బాధ లేకుండా తన కాళ్లపై తాను నిలబడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలా మంది నచ్చిన పని దొరకడం లేదని సమయాన్ని, వయస్సును వృథా చేసుకుంటుంటారు. అలాగే కొందరు జల్సాలు చేస్తూ తిరుగుతుంటారు. అలాంటి వారందరికీ గణేష్ ప్రేరణగా నిలుస్తున్నాడు. కష్టపడి పనిచేయాలనే తపన ఉండాలే కానీ ఏ పని అయినా చేయవచ్చని.. అందుకు శరీర వైకల్యం కూడా అడ్డుకాదని అతను నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని స్టోరీ తెలిసిన వారు కన్నీళ్లు పెడుతున్నారు. అతన్ని అభినందిస్తున్నారు. నెటిజన్లు అతన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే అతని స్టోరీ వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…