Sai Pallavi : తెలుగు సినీ ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో నటించిన చిత్రాల ద్వారానే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. మొదటి నుంచి ఈమె వివాదాలకు దూరంగా ఉంటుంది. అలాగే ఏ కంపెనీకి కూడా ప్రమోషన్ చేయనని స్పష్టంగా చెప్పేసింది. గ్లామర్ షోకు కూడా దూరంగా ఉంటానని తెలియజేసింది. దీంతో సాయిపల్లవికి అభిమానులు బాగానే ఏర్పడ్డారు. అయితే మొదట్నుంచీ వివాదాలకు దూరంగా ఉండే ఈమె తాజాగా అవనసరమైన కామెంట్స్ చేసి వివాదాల్లో ఇరుక్కుంది. దీంతో ఆమె తాజా మూవీ విరాట పర్వంకు సమస్యలు ఎదురయ్యేలా ఉన్నాయి.
విరాట పర్వం మూవీ ప్రమోషన్స్లో భాగంగా సాయిపల్లవి మాట్లాడుతూ.. గోహత్యకు, కాశ్మీర్ పండిట్ల హత్యలకు పెద్దగా తేడా ఏమీ లేదని.. రెండూ ఒకటేనని.. మతం ముసుగులో చేసే ఇలాంటి కార్యక్రమాలను తాను తీవ్రంగా ఖండిస్తానని.. ముందు అసలు మనుషులను మనుషులుగా చూడాలని.. మతం రంగు పులుమొద్దని.. కామెంట్స్ చేసింది. అయితే ఈమె వ్యాఖ్యల్లోని కొన్ని క్లిప్స్ను మాత్రమే కొందరు ప్రచారం చేశారు. అసలు ఆమె ఏం మాట్లాడిందో ప్రజలకు సరిగ్గా తెలియలేదు. దీంతో ఆమె ఈ కామెంట్స్ చేయడం ద్వారా అనవసరంగా వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బ్యాన్విరాటపర్వం అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఇలా సాయిపల్లవి అనవసరంగా కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుపోవడంతో ఇప్పుడు విరాటపర్వంకు సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి సాయిపల్లవి వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉంటుంది. కానీ ఆమె ఈసారి ఎందుకో ఇలా అనవసరంగా కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఆమె తొలిసారిగా ట్రోలింగ్కు, విమర్శలకు గురవుతోంది. ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు. వీటిపై సినీ సెలబ్రిటీలు మాట్లాడే ప్రయత్నం చేయరు. కానీ సాయి పల్లవికి అలా ఎందుకు అనిపించిందో.. ఏది ఏమైనా ఆమె చేసిన కామెంట్స్ వల్ల ఆమె ఇప్పుడు మొదటిసారిగా తీవ్ర విమర్శల పాలవుతోంది. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…