కడుపున పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు కొన్నిసార్లు కడుపుతీపి చంపుకొని బిడ్డల పట్ల ప్రవర్తించాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈక్రమంలోనే క్యాన్సర్ తో బాధపడుతున్న ఆ కొడుకు బాధను చూడలేని ఓ తండ్రి.. ఆ బాధ నుంచి తన కొడుకుకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో.. ఇంజక్షన్ ఇచ్చి ఆ కొడుకును చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం కరుసవల్లి గ్రామానికి చెందిన పెరియ స్వామి లారీ డ్రైవర్. అతనికి వన్నతమిళ్ కుమారుడు. సంవత్సరం క్రితం వన్నతమిళ్ కి కుడికాలి వేలికి ఒక కణతి ఏర్పడటంతో తమ కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా అది క్యాన్సర్ గడ్డ అని తేలింది. దీంతో ఎంతో బాధపడి ఆ తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకోవాలని ఎన్నో ఆసుపత్రులకు వెళ్లారు. అయితే రోజు రోజుకూ అతని ఆరోగ్యం క్షీణించడమే కాకుండా వైద్యం కూడా భారం కావడంతో.. ఆ కొడుకు ఎంతో నరకయాతన అనుభవించాడు.
తన కొడుకు పడుతున్న బాధను చూడలేక ఆ తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. ఈ క్రమంలోనే ఆ నరకం నుంచి తన కొడుకుకు విముక్తి కల్పించాలని పెరియ స్వామి సమీప బంధువులు ల్యాబ్ లో పనిచేస్తుండటంతో అతని సహాయంతో విషపు ఇంజక్షన్ తీసుకువచ్చి తన కొడుకుకు వేశారు. ఇలా మరణించిన తన కొడుకుని క్యాన్సర్ తో మరణించాడని చెప్పినప్పటికీ.. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…