కడుపున పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు కొన్నిసార్లు కడుపుతీపి చంపుకొని బిడ్డల పట్ల ప్రవర్తించాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈక్రమంలోనే క్యాన్సర్ తో బాధపడుతున్న ఆ కొడుకు బాధను చూడలేని ఓ తండ్రి.. ఆ బాధ నుంచి తన కొడుకుకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో.. ఇంజక్షన్ ఇచ్చి ఆ కొడుకును చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం కరుసవల్లి గ్రామానికి చెందిన పెరియ స్వామి లారీ డ్రైవర్. అతనికి వన్నతమిళ్ కుమారుడు. సంవత్సరం క్రితం వన్నతమిళ్ కి కుడికాలి వేలికి ఒక కణతి ఏర్పడటంతో తమ కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా అది క్యాన్సర్ గడ్డ అని తేలింది. దీంతో ఎంతో బాధపడి ఆ తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకోవాలని ఎన్నో ఆసుపత్రులకు వెళ్లారు. అయితే రోజు రోజుకూ అతని ఆరోగ్యం క్షీణించడమే కాకుండా వైద్యం కూడా భారం కావడంతో.. ఆ కొడుకు ఎంతో నరకయాతన అనుభవించాడు.
తన కొడుకు పడుతున్న బాధను చూడలేక ఆ తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. ఈ క్రమంలోనే ఆ నరకం నుంచి తన కొడుకుకు విముక్తి కల్పించాలని పెరియ స్వామి సమీప బంధువులు ల్యాబ్ లో పనిచేస్తుండటంతో అతని సహాయంతో విషపు ఇంజక్షన్ తీసుకువచ్చి తన కొడుకుకు వేశారు. ఇలా మరణించిన తన కొడుకుని క్యాన్సర్ తో మరణించాడని చెప్పినప్పటికీ.. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…