F3 Movie : వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్లు హీరోయిన్లుగా వస్తున్న చిత్రం.. ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 27వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఎఫ్2కు సీక్వెల్ గా వస్తున్న ఎఫ్3 మూవీలో వినోదం రెండు రెట్లు పెరిగిందని ఇప్పటికే విడుదలైన ఎఫ్3 ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ మూవీకి చెందిన స్టోరీ కూడా సోషల్ మీడియాలో లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. సెకండాఫ్ లో 20 నిమిషాల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఎపిసోడ్ ఒకటి ఉంటుందని సమాచారం. దీంతో మూవీకి ఇదే హైలైట్ అవుతుందని అంటున్నారు.
ఇక ఎఫ్3 మూవీకి గాను డిజిటల్ హక్కులను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో అదే ప్లాట్ఫామ్పై ఈ మూవీ విడుదల కానుంది. అయితే నిర్మాత దిల్ రాజు చెబుతున్న ప్రకారం.. సినిమా విడుదలైన 50 రోజుల తరువాతే ఓటీటీలోకి ఇవ్వాలని అనుకున్నారట. అలా చూస్తే ఎఫ్3 మూవీ జూలైలోనే స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఇదంతా సినిమా హిట్ అయితేనే జరుగుతుంది. లేదంటే మూవీ 3 వారాల్లోనే ఓటీటీలోకి వస్తుంది. ఇక ఈ విషయంపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.
కాగా ఎఫ్3 మూవీలో సునీల్, రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే పూజా హెగ్డె ఓ ప్రత్యేక సాంగ్లో అలరించింది. ఆ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే సినిమా కూడా హిట్ అవుతుందని మేకర్స్ అనుకుంటున్నారు. కరోనా మూడో వేవ్ తరువాత పక్కా కామెడీ జోనర్లో రిలీజ్ అవుతున్న మొదటి మూవీ ఇదే కావడం విశేషం. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన చేస్తుందా.. అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…