Evaru Meelo Koteeshwarulu : ఎన్టీఆర్ హోస్ట్గా జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం అవుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే త్వరలో ఓ ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొంటారని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ ఎపిసోడ్కు చెందిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో మహేష్ బాబు, ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూస్తుంటే రెండు కళ్లూ చాలడం లేదు. ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు.
మహేష్ బాబు పాల్గొననున్న ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేవలం 4 గంటల్లోనూ 10 లక్షల మంది ఈ ప్రోమోను వీక్షించారు. ఇందులో మహేష్ అదిరిపోయే లుక్లో కనిపించి సందడి చేశారు.
మహేష్ బాబును ఎన్టీఆర్ షోలో.. మహేష్ అన్న అని సంబోధిస్తూ ఆహ్వానించారు. ఇక హాట్ సీట్లో కూర్చోగానే మహేష్ జోక్ చేశారు. ఒక ప్రశ్నకు జవాబును అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతారెందుకు ? అని మహేష్ అడగ్గా.. అందుకు తారక్.. ఊరికే సరదాకి, జోక్గా.. అని చెబుతూ నవ్వేశారు. కాగా ప్రోమో అయితే రిలీజ్ చేశారు, కానీ ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుంది ? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…