Wheat Grass Juice : గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి మానవాళి మనుగడకు పెద్ద సవాల్ విసురుతోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ సహజసిద్ధంగా పండిన ఆకుకూరలు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు ప్రస్తుతం గోధుమగడ్డి జ్యూస్ కూడా ఎక్కువగానే లభిస్తోంది. దీన్ని రోజుకు ఒక కప్పు చొప్పున పరగడుపునే తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమగడ్డిలో ఉండే ఔషధ గుణాలు ఆర్థరైటిస్, జలుబు సమస్యలను తగ్గించడంలో దోహదపడతాయి. ఇక ఈ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ జ్యూస్ను తాగడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది. అలాగే అజీర్ణం, గ్యాస్ నుంచి విముక్తి లభిస్తుంది.
ప్రతి రోజూ ఉదయం పరగడుపునే గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల ఆకలి అదుపులో ఉండి శరీర బరువు తగ్గుతుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. మహిళలు నెలసరి సమయంలో దీన్ని తాగితే నొప్పులు తగ్గిపోతాయి. ఇలా గోధుమ గడ్డి జ్యూస్ను రోజూ తాగితే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…