Cumin Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి జీలకర్రను వంటల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లో నేరుగా వేస్తారు. లేదా వేయించి పొడిగా కూడా ఉపయోగిస్తారు. జీలకర్ర వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే రోజూ ఉదయాన్నే పరగడుపునే జీలకర్ర నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ నీటిని తప్పక తాగాలి. ఇలా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర నీటిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. నడుము వద్ద ఉండే కొవ్వు పూర్తిగా కరిగి సన్నగా మారుతారు. దీంతోపాటు కిడ్నీ స్టోన్లు కూడా కరిగిపోతాయి. అలాగే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వస్తాయి. దీంతో జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పోతాయి.
జీలకర్ర నీటిని తాగడం వల్ల మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అలాగే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో డయాబెటిస్ నుంచి విముక్తి లభిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు. అయితే జీలకర్ర నీటిని ఒక కప్పు మోతాదులోనే తాగాలి. రెండు కప్పుల నీళ్లను పోసి అందులో ఒక టీస్పూన్ జీలకర్రను వేసి ఒక కప్పు నీళ్లు అయ్యే వరకు మరిగించాలి. తరువాత నీళ్లను వడకట్టి గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి. తాగిన తరువాత 30 నిమిషాల పాటు ఏమీ తినరాదు. ఇలా రోజూ క్రమపద్ధతిలో తాగడం వల్ల పైన తెలిపిన లాభాలు అన్నింటినీ పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…