Cardamom Milk : సుగంధ ద్రవ్యాలుగా పరిగణించే యాలకులను కూరలో వేస్తే ఘుమఘుమలాడుతాయి. పోషకాలు, ఫైబర్ కూడా ఈ గింజలలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో చూద్దాం. యాలకుల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడి ఆహారం జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో యాలకులు సహాయపతాయి. అంతేకాక కడుపు లైనింగ్ వాపును తగ్గిస్తాయి.
మనలో చాలా మంది ఒత్తిడి, సరైన జీవనశైలి లేని కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు రాత్రి సమయంలో యాలకుల పాలను తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. పాలు, యాలకుల్లో కాల్షియం సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. యాలకుల్లో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉండడం వలన రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు ధమనులలో అడ్డంకులు లేకుండా చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నోటిలో పొక్కులు, నోటిపూతను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గిస్తాయి.
యాలకులలో ఉండే ఔషధాలు లైంగిక ప్రేరణను పెంచడానికి తోడ్పడుతాయి. ఇది వేగంగా స్ఖలనం కాకుండా కాపాడుతుంది. దీంతో పడకగదిలో ఎక్కువసేపు ఆనందంగా గడుపుతారు. యాలకుల్లో విటమిన్ సి సమృద్దిగా ఉండడం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి దానిలో ఒక యాలకను దంచి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ బెల్లం తురుము లేదా తేనె వేసి ఒక నిమిషం మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ పాలను రోజు విడిచి రోజు తాగితే సరిపోతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి. యాలకులు మరియు పాలను కలిపి తీసుకుంటే పైన చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…