అన్నగారు నందమూరి తారక రామారావు సినీ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన హీరోల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. 1989 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన బాల గోపాలుడు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు కళ్యాణ్ రామ్. మరలా తిరిగి 2003లో వచ్చిన తొలి చూపులోనే అనే చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించకపోయినా కళ్యాణ్ రామ్ కి మాత్రం నటనపరంగా మంచి గుర్తింపు వచ్చింది.
2005లో అతనొక్కడే చిత్రంతో మొదటి సక్సెస్ ను అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత తన సొంత సంస్థలోనే తనకు నచ్చిన కథలు ఎంచుకుంటూ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక 2006లో పెద్దలు కుదిర్చిన సంబంధంతో స్వాతిని వివాహం చేసుకున్నారు కళ్యాణ్ రామ్. పెళ్లిచూపుల సమయంలోనే స్వాతిని చూసి బాగా నచ్చడంతో ఆమెను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోను అని కుటుంబ సభ్యులతో కచ్చితంగా చెప్పేశారట కళ్యాణ్ రామ్. ఇక కళ్యాణ్ రామ్ అభిప్రాయంతో ఏకీభవించి స్వాతితో వివాహం చేశారు కుటుంబ సభ్యులు.
స్వాతి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని మంచి కుటుంబం నుంచి వచ్చిన యువతి. పెళ్లికి ముందు ఈవిడ డాక్టర్ గా పని చేసేవారు. పెళ్లి అయిన తర్వాత కుటుంబ బాధ్యతల కోసం తన వైద్య వృత్తిని వదులుకున్నారు స్వాతి. కళ్యాణ్ రామ్, స్వాతి దంపతులకు తారక అద్వైత, శౌర్య రామ అనే ఇద్దరు సంతానం. పిల్లలు పెరిగి పెద్ద అవడంతో కళ్యాణ్ రామ్ సహకారంతో సొంత వీఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించారు స్వాతి.
మొదటి నుంచి కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ ఆగస్టు 5న బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కళ్యాణ్ రామ్. ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించారు. కథ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. బింబసార బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్న సమయంలో బింబిసార చిత్రం సక్సెస్ తో ఊపిరిపోసింది.. అని చెప్పవచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…