Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ తొలిసారిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రల్లో నటించిన చిత్రం.. ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయింది. చాలా రోజుల తరువాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. అయితే కరోనా వల్ల అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. కానీ సినిమా తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ఇక మొత్తంగా చూస్తే ఆచార్య సినిమా థియేటర్ల నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లే అనుకోవాలి. అయితే ఇప్పుడు సినిమాకు అయిన బడ్జెట్ ఎంత ? వచ్చిన మొత్తం ఎంత ? అని ప్రేక్షకులు ఆరాలు తీస్తున్నారు. ఇక ఆ విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే..
ఆచార్య సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ ఏకంగా.. రూ.140 కోట్లను ఖర్చు చేశారు. అందులో ధర్మస్థలి అనే ఊరు సెట్ను వేసిన విషయం విదితమే. దీన్ని హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలోని చిరంజీవి సొంత స్థలంలో నిర్మించారు. అయితే ఈ సెట్ కోసమే భారీగా ఖర్చు చేశారు. అందుకనే అంత బడ్జెట్ అయింది. ఇక రూ.140 కోట్లను పెట్టి సినిమాను తీసినా.. వచ్చింది రూ.48.29 కోట్లు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కలుపుకుంటే వచ్చిన లెక్క ఇది. మొత్తం గ్రాస్ రూ.75.90 కోట్లు సాధించగా.. నెట్ రూ.48.29 కోట్లను సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.84.21 కోట్లు రావాలి. అదిప్పుడు అసాధ్యమనే చెప్పవచ్చు. దీంతో ఆచార్య మూవీకి గాను నిర్మాతలకు భారీ నష్టమే వచ్చిందని చెప్పవచ్చు.
ఇక ఇప్పటికే ఒక డిస్ట్రిబ్యూటర్ తమ నష్టాలను భరించాలని.. తమకు డబ్బు ఇవ్వాలని చిరంజీవికి లేఖ రాశారు. అయితే ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. దీంతో ఆయన వచ్చిన వెంటనే నష్టాలను అందరికీ భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఈ పనిలో ప్రస్తుతం రామ్ చరణ్ తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ కానుంది. దీంతో ఆ మూవీ ద్వారా వచ్చే లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు అందిస్తారని చరణ్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మరోవైపు కొరటాల శివ కూడా నష్టాలను కొంత వరకు భర్తీ చేస్తారని మాట ఇచ్చినట్లు సమాచారం. సినిమా ఫ్లాప్ అవడం వెనుక దర్శకుడిగా తన ఫెయిల్యూర్ కూడా ఉంది కనుక ఆయన కూడా కొంత మేర నష్టాన్ని భర్తీ చేసేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తరువాత సినిమా ఎన్టీఆర్తో చేస్తున్నారు కనుక.. అది హిట్ అయితే దాని ద్వారా వచ్చే లాభాలతో ఆయన ఆచార్య నష్టాలను భర్తీ చేస్తారని.. మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…