Chiranjeevi : స్వయంకృషితో ఉన్నత స్థానంలో నిలిచిన చిరంజీవి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మెగాస్టార్గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. పునాది రాళ్లుతో నటుడిగా పరిచయం అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు సినిమానే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్వశక్తితో ఎదిగిన చిరంజీవి జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన్ని స్పూర్తిగా తీసుకుని నటులైన వారు చాలామందే ఉన్నారు. స్టైల్, మేనరిజమ్, మాస్ ఆడియెన్స్ను మెప్పించడం, జానర్ ఏదైనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తన నటనతో నిండుదనం తీసుకురావడం ఒక్క చిరంజీవికే సాధ్యం.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి. అప్పటికే ఎంతో మంది హీరోలున్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని మెగాస్టార్గా ఎదిగారు. ఇక చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ప్రదానం ఎవరు చేశారనే విషయం చాలా మందికి తెలియదు. టాలీవుడ్లో చిరంజీవిని మెగాస్టార్ను చేసిన నిర్మాత కె.ఎస్.రామారావు. ఈయన తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో చిరంజీవితో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
చిరంజీవి, నిర్మాత కె.ఎస్.రామారావు కలయికలో వచ్చిన తొలి చిత్రం అభిలాష. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అభిలాష సినిమా టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచింది. ఈ కాంబినేషన్లో వచ్చిన ఛాలెంజ్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. రాక్షసుడు, మరణ మృదంగం సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. మరణ మృదంగం చిత్రంతోనే అప్పటి వరకు సుప్రీం హీరో బిరుదుతో వస్తున్న చిరంజీవి ముందు మెగాస్టార్ బిరుదు వచ్చి చేరింది. అలా చిరంజీవి ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీగా మారడం వెనుక ఉన్న అసలు వ్యక్తి కేఎస్ రామారావు అనే చెప్పాలి.
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…