DJ Tillu : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా డీజే టిల్లు. అట్లుంటది మనతోని అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్స్ లేక థియేటర్లు వెలవెలబోతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే డీజే టిల్లులో హీరోయిన్ గా నటించిన నేహాశెట్టి ఈ సినిమాలో నటించదంటూ ముందుగానే చెప్పేశారు.
ఈమూవీలో హీరోయిన్ గా తొలుత శ్రీలీలను అనుకున్నా.. అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారు. ఇంతకీ శ్రీలీల తప్పుకోవడానికి, అనుపమ ఫైనల్ కావడానికి కారణమేంటో తెలిసింది. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. శ్రీలీల చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే మాస్ మహా రాజా రవితేజ సరసన ధమాకాలో, అనగనగా ఒక రాజు మూవీలలో నటిస్తోంది. మరోవైపు బాలయ్య అప్ కమింగ్ ఫిల్మ్ లోనూ మెరియనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా డీజే టిల్లును నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే శ్రీలీలకు సంబంధించిన మరో 3 ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి.
అలాగే ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో డీజే టిల్లు 2కు హీరోయిన్ గా ఎంపిక చేస్తే డేట్స్ క్లాష్ అయ్యే అవకాశం ఉందని శ్రీలీలనే తప్పుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలీల తప్పుకోవడంతో అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేసి షూటింగ్ ను ప్రారంభించారు. శ్రీలీల కంటే అనుపమకు యూత్ లో గట్టి ఫాలోయింగ్ ఉండటం, ఇటీవలనే కార్తీకేయ 2తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో అనుపమను ఫైనల్ చేశారు. మొత్తంగా డీజే టిల్లు 2 హీరోయిన్ గా కేరళ కుట్టిని ఫైనల్ చేసినట్టు మేకర్స్ కన్ఫమ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…