Naresh : సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోంది. నరేష్ భార్య రమ్య.. కర్ణాటకలో మీడియాకు ఎక్కడంతో మొత్తం తంతు అంతా బయటకు వచ్చింది. నరేష్, పవిత్ర ఇద్దరూ తాము సహజీవనం చేస్తున్నామని ఒప్పుకోక తప్పలేదు. ఈ క్రమంలోనే వారిపై రమ్య న్యాయ పోరాటం చేస్తానంటోంది. మరోవైపు రమ్యకు పలువురు మద్దతు తెలుపుతుండగా.. నరేష్కు కూడా కొందరు సపోర్ట్ను ఇస్తున్నారు. అయితే నరేష్, పవిత్రల వ్యవహారం ఏమో గానీ సోషల్ మీడియాలో మీమ్స్ సృష్టిస్తున్న వారికి మంచి కంటెంట్ దొరికినట్లు అయింది. దీంతో వారు ఆ ఇద్దరిపై మీమ్స్ పెడుతూ నెటిజన్లకు వినోదాన్ని అందిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో అత్యంత సంచలనం సృష్టించిన సంఘటన ఏదైనా ఉంది.. అంటే అది నరేష్, పవిత్ర లోకేష్ల వ్యవహారం అనే చెప్పవచ్చు. ఈ ఇద్దరూ ఎంతో కాలం నుంచి సహజీవనం చేస్తున్నా.. రమ్య కారణంగా వీరిద్దరి విషయాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. అయితే దీన్నే చాలా మంది కంటెంట్గా చేసుకుని మీమ్స్ చేస్తున్నారు. తాజాగా ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డీజే టిల్లులో ఒక ఫేమస్ సీన్ ఉంటుంది తెలుసు కదా.. ఇప్పుడేం చేద్దాం అంటే.. నిజంగా నన్ను ఈ ప్రశ్న కావాలనే అడుగుతున్నావు కదా రాధికా.. అనే డైలాగ్ ఉంటుంది. అయితే దీన్ని నరేష్, పవిత్రలకు అన్వయిస్తున్నారు.
ఇప్పటి వరకు నరేష్, పవిత్రల మధ్య ఉన్న బంధం రివీల్ కాలేదు. కానీ నరేష్ భార్య రమ్య కారణంగా ఆ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. దీంతో ఆ ఇద్దరూ నిజాన్ని అంగీకరించక తప్పడం లేదు. ఇక దీన్నే డీజే టిల్లులోని డైలాగ్కు ఆపాదిస్తున్నారు. ఇప్పుడేం చేద్దాం నరేష్.. అంటే.. నువ్వు నిజంగా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావా పవిత్ర.. అని ఒక మీమ్ ను సృష్టించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా వీరి వ్యవహారం ఏమోగానీ ఇప్పుడు మీమ్స్ క్రియేటర్లకు కావల్సినంత కంటెంట్ దొరికినట్లు అయింది. దీంతో వీరిపై చాలా మీమ్స్ చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…