Ramya Krishnan : అందాల భామ రమ్యకృష్ణకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు. అప్పట్లో రమ్యకృష్ణ సినిమాలు వస్తున్నాయంటే చాలు కుర్రకారు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. అప్పటి యూత్ లో అంత క్రేజ్ ఉండేది రమ్యకృష్ణకి. తన అందచందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. తెలుగుతోపాటు తమిళ్, హిందీలో అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2003లో డైరెక్టర్ కృష్ణ వంశీని వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత రంగమార్తాండ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది రమ్యకృష్ణ.
సినీ ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్న రమ్యకృష్ణ, కృష్ణవంశీ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ గత కొంతకాలంగా రమ్యకృష్ణ, కృష్ణవంశీల మీద ఒక వార్త బాగా ప్రచారం అవుతోంది. ఈ దంపతులు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఈ వార్తని కృష్ణవంశీ ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా వార్తలను ప్రచారం అవడానికి గల కారణం వీరు గత కొంత కాలంగా దూరంగా ఉండటమే.
అయితే కృష్ణవంశీ ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణతో విడిపోయారనే వార్తలు ప్రసారం కావడంపై క్లారిటీ ఇచ్చారు. రమ్యకృష్ణ ఇటీవల లైగర్ ఈ చిత్రంలో నటించిందని అందరికీ తెలిసిన విషయమే. లైగర్ చిత్రంలో అద్భుతమైన నటన ఎవరిది అంటే అది ఒక రమ్యకృష్ణనే అని చెప్పవచ్చు. లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా రమ్యకృష్ణ గత కొంతకాలంగా ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా కృష్ణవంశీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా వివాహ బంధంపై చాలా పుకార్లు వస్తున్నాయి. కానీ వాటిలో అసలు నిజం లేదు.
నేను రమ్య విడిపోలేదు. మేము ఎప్పటికీ కలిసే ఉంటాం. మొదట్లో ఇలాంటి వార్తలు చూసి ఇద్దరం బాధపడే వాళ్లం. నేను, రమ్యకృష్ణ వేరుగా ఉండటం నిజమే. నేను సినిమా షూటింగ్ పనుల కోసం హైదరాబాద్లో ఉంటున్నాను. రమ్యకృష్ణ మా బాబుని చదివించుకుంటూ చెన్నైలో ఉంటుంది. కచ్చితంగా ఖాళీ సమయం దొరికినప్పుడు మేము కలుస్తాం. మా మధ్య విభేదాలు, విడాకులు అనే వార్తలు అవాస్తవం. ఇది కేవలం పుకార్లు మాత్రమే, దీనిలో నిజం లేదు.. అంటూ కృష్ణ వంశీ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…