Dengue Fever : ప్రస్తుత సీజన్లో డెంగ్యూ అధికంగా విస్తరిస్తోంది. డెంగ్యూ కారణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ జ్వరం కారణంగా రోగి శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం జరుగుతుంది. దీంతోపాటు శరీరంలో విపరీతమైన నొప్పి, కీళ్ల నొప్పులు, శారీరక బలహీనత, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే డెంగ్యూ వచ్చినప్పుడు ఆ జ్వరం ఎంతకాలం ఉంటుందోనని భయాందోళనకు గురవుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకొని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి.
సీడీసీ (వ్యాధి నియంత్రణ మరియు నివారణకు కేంద్రం) వివరాల ప్రకారం.. డెంగ్యూ లక్షణాలు సాధారణంగా 2-7 రోజుల వరకు ఉంటాయి. చాలా మంది 1 వారంలోపు కోలుకుంటారు. డెంగ్యూ వచ్చిన మొదట్లో ఇతర వ్యాధులను సూచిస్తాయి. దీంతో చాలామంది డెంగ్యూ, వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతుంటారు. డెంగ్యూ జ్వరంలో నొప్పి లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇది కాకుండా కంటి నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, ఎముకల నొప్పి, వికారం/వాంతులు, కీళ్ల నొప్పులు మొదలైనవి ఉంటాయి.
జ్వరం వచ్చినా, డెంగ్యూ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరాన్ని నియంత్రించడానికి, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వైద్యుడు సూచించిన యాంటీ బయాటిక్స్ తీసుకోండి. వైద్య సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు. హైడ్రేటెడ్ గా ఉండటానికి ద్రవాలు సేవిస్తుండాలి. ఎలక్ట్రోలైట్స్ జోడించిన నీరు లేదా పానీయాలు తాగడం ఉత్తమం. శిశువులు, పిల్లలు లేదా వృద్ధులలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. డెంగ్యూ వచ్చిన వారు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…