Hyper Aadi : బుల్లితెరపై పలు టీవీ షోల ద్వారా హైపర్ ఆది ఎలా అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ వేదికపై ఆది చేసే హంగామ అంతా ఇంతా కాదు. అయితే ఈ షోలో గత కొద్ది రోజులుగా ఆది కనిపించడం లేదు. కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలోనే కనిపిస్తున్నాడు. అయితే గతంలో జబర్దస్త్ వేదికపై పలువురు అగ్ర హీరోలు, రాజకీయ నాయకులను మిమిక్రీ చేస్తూ కొందరు చేసిన స్కిట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీంతో అప్పట్లో పలువురు జబర్దస్త్ కమెడియన్లు ఫ్యాన్స్కు సారీ చెప్పారు. అయితే ఆ విషయాన్ని మరిచిపోయాడో ఏమో తెలియదు కానీ.. హైపర్ ఆది కూడా తాజాగా మళ్లీ అలాంటి తప్పే చేశాడు. సీఎం వైఎస్ జగన్ను అనుకరించి స్కిట్ చేశాడు. అయితే అది బోల్తాకొట్టింది. అది ఆదికే రివర్స్లో తగిలింది. దీంతో ఆదిని అటు వైసీపీ ఫ్యాన్స్, ఇటు సీఎం జగన్ ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆది ఏకంగా చనిపోయాడని పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సీఎం జగన్ 2019లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే పదాలను బాగా వాడారు. అయితే కేవలం పదాలను మాత్రమే కాదు.. ఆయన చేసిన పాదయాత్ర.. ఇచ్చిన హామీలు నచ్చి జనం ఆయనను సీఎంను చేశారు. అయితే ఇటీవల సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ కూడా అవే డైలాగ్స్ను వాడారు. దీంతో వైసీపీ ఫ్యాన్స్ మహేష్ను మెచ్చుకున్నారు. అయితే ఆ డైలాగ్లను సీరియస్గా వాడాలి కానీ.. కామెడీ కోసం వాడకూడదు. ఆ విషయం కూడా తెలియకుండా హైపర్ ఆది.. తాజాగా విడుదల చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఇవే డైలాగ్లను వాడాడు.
మేము ఉన్నాం.. అని ఒక యువకుడు ఈ ప్రోమోలో అనగా.. ఇంకొక యువకుడు మేము విన్నాం అంటాడు. దీంతో హైపర్ ఆది.. సరే మేము ఉంటాం.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా డైలాగ్లు చెప్పడంతో ఆదిపై వైసీపీ ఫ్యాన్స్, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆదిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆదిపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆది ఏకంగా చనిపోయాడని పోస్టులు పెడుతూ వాటిని వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆది స్పందించాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…