Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఏం చేసినా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంటుంది. అందుకు గల కారణం ఈమె చేసే ట్వీట్స్ అని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం కంగనారనౌత్ భారత స్వాతంత్రోద్యమం, మహాత్మా గాంధీ పై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఈమె వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్వాతంత్ర ఉద్యమం గురించి కంగనా మాట్లాడిన వ్యాఖ్యలపై జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో ఏకంగా ఈమెపై దేశ ద్రోహ కేసులు నమోదు చేశారు.
గత కొన్ని రోజుల క్రితం ఈమె భారత స్వాతంత్రోద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకొని ఎన్నో విమర్శలు చేశారు. ఒక చెంప చూపిస్తే స్వార్థం కాదు కేవలం భిక్ష మాత్రమే వస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు స్పందిస్తూ తన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.
ఆమె కేవలం తన వ్యాఖ్యలతోనే దేశ పరువుకు నష్టం కలిగిస్తుందని.. ఈ క్రమంలోనే ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కాగా కంగనా పై జార్ఖండ్లోని పండర్పాలా నివాసి ఇజార్ అహ్మద్ ధన్బాద్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రానుంది. అదేవిధంగా బీహార్లో కూడా ఈమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. అది ఈ నెల 22వ తేదీన విచారణకు రానుంది.
ఇలా భారత స్వాతంత్రం గురించి, స్వాతంత్ర యోధుల గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఈమెపై చర్యలు తీసుకోవాలని.. డిమాండ్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…