Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఓ యాడ్లో నటించిన సంగతి తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఓ యాడ్ చేశారు. తెలుగు కొత్త సంవత్సరాది రోజున ఈ యాడ్ను విడుదల చేశారు. కాస్త వెరైటీగా యాడ్ని ప్లాన్ చేయగా, ఈ యాడ్కు విశేష స్పందన లభిస్తోంది. ఈ యాడ్ కోసం చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ యాడ్ కోసం చిరంజీవి దాదాపుగా రూ. 7 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్కో సినిమా కోసం రూ. 20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న చిరంజీవి యాడ్ కోసం రూ. 7 కోట్ల వరకు చార్జ్ చేసినట్టు సమాచారం.
కొన్ని నిమిషాల యాడ్ కోసం చిరంజీవి అంత మొత్తం వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చిరంజీవి వంటి సీనియర్ హీరో ఈ యాడ్ చేయడంతో శుభగృహ రియల్ ఎస్టేట్కు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో చూడాలి. ఈ యాడ్ను సుకుమార్ డైరెక్ట్ చేశారు. గతంలో చిరంజీవి.. కృష్ణవంశీ దర్శకత్వంలో థమ్స్ అప్తో పాటు నవరత్న ఆయిల్కు పదమూడేళ్ల క్రితం బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీటైంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తొలిసారి పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ అనే టైటిల్తో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూట్ పూర్తయింది. దీంతో పాటు చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. దాంతోపాటు బాబీ సినిమా చేస్తున్నారు. ఇంకోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇలా చిరంజీవి ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు యాడ్ లో నటించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…