Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఓ యాడ్లో నటించిన సంగతి తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఓ యాడ్ చేశారు. తెలుగు కొత్త సంవత్సరాది రోజున ఈ యాడ్ను విడుదల చేశారు. కాస్త వెరైటీగా యాడ్ని ప్లాన్ చేయగా, ఈ యాడ్కు విశేష స్పందన లభిస్తోంది. ఈ యాడ్ కోసం చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ యాడ్ కోసం చిరంజీవి దాదాపుగా రూ. 7 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్కో సినిమా కోసం రూ. 20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న చిరంజీవి యాడ్ కోసం రూ. 7 కోట్ల వరకు చార్జ్ చేసినట్టు సమాచారం.
కొన్ని నిమిషాల యాడ్ కోసం చిరంజీవి అంత మొత్తం వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చిరంజీవి వంటి సీనియర్ హీరో ఈ యాడ్ చేయడంతో శుభగృహ రియల్ ఎస్టేట్కు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో చూడాలి. ఈ యాడ్ను సుకుమార్ డైరెక్ట్ చేశారు. గతంలో చిరంజీవి.. కృష్ణవంశీ దర్శకత్వంలో థమ్స్ అప్తో పాటు నవరత్న ఆయిల్కు పదమూడేళ్ల క్రితం బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీటైంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తొలిసారి పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ అనే టైటిల్తో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూట్ పూర్తయింది. దీంతో పాటు చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. దాంతోపాటు బాబీ సినిమా చేస్తున్నారు. ఇంకోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇలా చిరంజీవి ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు యాడ్ లో నటించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…