Charmy Kaur : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాకు ఛార్మి నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా భారీ అంచనాలతో గురువారం రిలీజ్ అయింది. లైగర్ మూవీ రిలీజ్ కి ముందు పూరీ బ్యాచ్ చేసిన హడావిడి మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఇండియా షేక్ అవుద్ది. వాట్ లగా దేంగే.. ఆగ్ లగా దేంగే.. అంటూ విజయ్-పూరీలు చేసిన హంగామా మాములుగా లేదు.
పైగా విజయ్ అయితే సినిమా చూస్తే చూడండి లేదంటే లేదు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. సినిమా విషయంలో టీం అంతా ఓవర్ కాన్ఫిడెంన్స్ తో ఉంది. మూవీపై చివరకు తీర్పు చెప్పాల్సింది ఆడియెన్స్. ప్రీమియర్స్ టాకే తేడా కొట్టింది. ఇక ఇప్పుడు రివ్యూయర్లు కూడా లైగర్ను లైట్ తీసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు లైగర్ను ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలో ఛార్మి టార్గెట్ అయింది. గతంలో ఛార్మి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు కొంప ముంచేసింది. బ్రూస్లీ సినిమా విడుదలైన రోజు ఛార్మి ఓ ట్వీట్ చేసింది. అది బ్రూస్ లీ సినిమా డిజాస్టర్ అయినందుకు చేసిన ట్వీటా ? మరే ఉద్దేశ్యంతోనైనా ఛార్మీ ట్వీట్ చేసిందా ? అన్నది తెలియడం లేదు.
కానీ ఇప్పుడు మాత్రం జనాలు దానికి దీనికి లింక్ చేస్తున్నారు. బ్రూస్ లీ సినిమా పోయిందని ఛార్మీ ఇలా ట్వీట్ చేసిందని, ఆ చిత్రం పోయినందుకే పూరీ బ్యాచ్ పార్టీలు చేసుకున్నారని టాక్. అయితే ఇప్పుడు ఛార్మీ మీద నెటిజన్లు మండి పడుతున్నారు. నాడు పగలబడి నవ్వావ్.. నేడు మీ సినిమా కూడా పోయింది.. ఇప్పుడు నవ్వు అంటూ ఛార్మీ మీద సెటైర్లు వేస్తున్నారు. నాడు ఛార్మి చేసిన ట్వీట్ కి ఈ రోజు ఇలా ఛార్మి బలి కావాల్సి వస్తోంది. నెటిజన్లు ఛార్మి మీద రకరకాల కామెంట్లతో రెచ్చిపోతోన్నారు. వైరల్ అవుతున్న ట్వీట్ గురించి ఛార్మి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…