Charmi Kaur Puri Jagannadh : టాలీవుడ్ లో కేవలం గ్లామర్ షో తోనే హీరోయిన్స్ గా చెలామణీ అవుతున్న ఈ తరుణంలో తన అందంతో, అభియనంతో విభిన్న రకాల చిత్రాలను చేస్తూ టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర స్థానంలో నిలిచిన హీరోయిన్స్ లలో ఛార్మి ఒకరు. 2002 లో నీ తోడు కావాలి అనే సినిమాతో ఛార్మి తెలుగు తెరకు పరిచయమయ్యింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో ఛార్మి నటించింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలోనూ విభిన్న రకాల పాత్రలను పోషించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
2015 లో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాతో తన హీరోయిన్ కెరీర్ కు గుడ్ బై చెప్పింది. తరువాత ప్రముఖ దర్శకుడు పూరీ జగనాథ్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది ఛార్మి. వరుస సినిమాలను నిర్మిస్తూ నిర్మాణ రంగంలో దూసుకు పోతున్న ఛార్మి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అప్పట్లో ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తో ఛార్మి ప్రేమాయణం వార్త పెద్ద సంచలనమే సృషించిదని మనందరికీ తెలుసు. వీరిద్దరూ కలిసి పబ్ లకు, ప్రైవేట్ పార్టీలకు వెళ్లే వారని, త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి.
కానీ కొన్ని రోజులు లవ్ తరువాత వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారని సమాచారం. దీంతో ఛార్మి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిందట. ఈ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ఎందుకు విడిపోయారో తెలియదు. అయితే సినీ రంగానికే చెందిన ఓ వ్యక్తి కారణంగానే వారు విడిపోయినట్లు సమాచారం. అయితే ఆ సమయంలోనే పూరీ జగన్నాథ్ జ్యోతిలక్ష్మి సినిమాతో ఛార్మికి ఒక మంచి స్నేహితుడిలా దగ్గరవడం, డిప్రెషన్ లో ఉన్న ఛార్మిని కెరీర్ పరంగా దృష్టి సారించేలా చేయడం, నిర్మాణ రంగం వైపు అడుగులు వేసేలా చేయడం.. వంటివి చకచకా జరిగి పోయాయి. వీరిద్దరూ కలిసి నిర్మించిన సినిమాలలో ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగిలిన సినిమాలు పెద్దగా విజయాలను సాధించ లేదు. దీంతో ఆర్థికంగా ఛార్మి, పూరీ జగన్నాథ్ ఇద్దరూ దెబ్బ తిన్నారు.
ఇస్మార్ట్ శంకర్ సాధించిన విజయంతో వీరిద్దరూ లాభాల బాట పట్టారని సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి విజయ్ దేవర కొండతో లైగర్ అనే సినిమాను తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించే పనిలో చాలా బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలల్లో కూడా ఈ సినిమా తెరకెక్కనుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో.. లేదో.. చూడాల్సి ఉంది.
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్లోనే కాదు, డ్యాన్స్లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…