Charmi Kaur Puri Jagannadh : ఛార్మి.. పూరీ జ‌గ‌న్నాథ్‌.. స్నేహితులు అయింది అలా..!

Charmi Kaur Puri Jagannadh : టాలీవుడ్ లో కేవ‌లం గ్లామ‌ర్ షో తోనే హీరోయిన్స్ గా చెలామ‌ణీ అవుతున్న ఈ త‌రుణంలో తన‌ అందంతో, అభియ‌నంతో విభిన్న ర‌కాల చిత్రాల‌ను చేస్తూ టాలీవుడ్ లో ఒక‌ప్పుడు అగ్ర స్థానంలో నిలిచిన హీరోయిన్స్ ల‌లో ఛార్మి ఒక‌రు. 2002 లో నీ తోడు కావాలి అనే సినిమాతో ఛార్మి తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యింది. అతి త‌క్కువ స‌మయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో ఛార్మి న‌టించింది. కేవ‌లం హీరోయిన్ గా మాత్ర‌మే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌లోనూ విభిన్న ర‌కాల పాత్ర‌ల‌ను పోషించి త‌నకంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Charmi Kaur Puri Jagannadh

2015 లో వ‌చ్చిన జ్యోతిల‌క్ష్మి సినిమాతో త‌న హీరోయిన్ కెరీర్ కు గుడ్ బై చెప్పింది. త‌రువాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌నాథ్ తో క‌లిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది ఛార్మి. వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తూ నిర్మాణ రంగంలో దూసుకు పోతున్న ఛార్మి గురించి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఒక వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అప్ప‌ట్లో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ ప్ర‌సాద్ తో ఛార్మి ప్రేమాయ‌ణం వార్త పెద్ద సంచ‌ల‌న‌మే సృషించిద‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీరిద్ద‌రూ క‌లిసి ప‌బ్ ల‌కు, ప్రైవేట్ పార్టీల‌కు వెళ్లే వార‌ని, త్వ‌ర‌లో వీరిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌నే వార్తలు అప్ప‌ట్లో పెద్ద ఎత్తున వ‌చ్చాయి.

కానీ కొన్ని రోజులు ల‌వ్ త‌రువాత వీరిద్ద‌రి మధ్య వ‌చ్చిన విభేదాల కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోయార‌ని స‌మాచారం. దీంతో ఛార్మి చాలా డిప్రెష‌న్ లోకి వెళ్ళింద‌ట‌. ఈ ఇద్ద‌రూ గాఢంగా ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుందామ‌నుకున్నారు. కానీ ఎందుకు విడిపోయారో తెలియ‌దు. అయితే సినీ రంగానికే చెందిన ఓ వ్య‌క్తి కార‌ణంగానే వారు విడిపోయిన‌ట్లు స‌మాచారం. అయితే ఆ స‌మ‌యంలోనే పూరీ జ‌గ‌న్నాథ్ జ్యోతిల‌క్ష్మి సినిమాతో ఛార్మికి ఒక మంచి స్నేహితుడిలా ద‌గ్గ‌ర‌వ‌డం, డిప్రెష‌న్ లో ఉన్న ఛార్మిని కెరీర్ ప‌రంగా దృష్టి సారించేలా చేయ‌డం, నిర్మాణ రంగం వైపు అడుగులు వేసేలా చేయ‌డం.. వంటివి చ‌క‌చ‌కా జ‌రిగి పోయాయి. వీరిద్ద‌రూ క‌లిసి నిర్మించిన సినిమాల‌లో ఇస్మార్ట్ శంక‌ర్ త‌ప్ప మిగిలిన సినిమాలు పెద్ద‌గా విజ‌యాల‌ను సాధించ లేదు. దీంతో ఆర్థికంగా ఛార్మి, పూరీ జ‌గ‌న్నాథ్ ఇద్ద‌రూ దెబ్బ తిన్నారు.

ఇస్మార్ట్ శంక‌ర్ సాధించిన విజ‌యంతో వీరిద్ద‌రూ లాభాల బాట ప‌ట్టార‌ని స‌మాచారం. ప్రస్తుతం వీరిద్ద‌రూ క‌లిసి విజ‌య్ దేవ‌ర కొండ‌తో లైగ‌ర్ అనే సినిమాను తీస్తున్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించే ప‌నిలో చాలా బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌ల్లో కూడా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మ‌రీ ఈ సినిమా ఆ అంచ‌నాల‌ను అందుకుంటుందో.. లేదో.. చూడాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

పాపం నిధి అగ‌ర్వాల్.. రెండు సినిమాలు ఫ్లాప్‌.. ఇప్పుడెలా..? కెరీర్ డైలమాలో ‘ఇస్మార్ట్’ బ్యూటీ!

నిధి అగర్వాల్ కెరీర్‌లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…

Thursday, 5 February 2026, 9:38 PM

గూగుల్ పిక్సెల్ 10a వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? విడుదల తేదీ ఎప్పుడంటే..?

గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…

Thursday, 5 February 2026, 7:46 PM

ఫిబ్ర‌వ‌రి 26న పెళ్లి..? ర‌ష్మిక మౌనానికి అర్థం ఏమిటి..? ఫ్యాన్స్‌లో మొదలైన చర్చ!

నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…

Thursday, 5 February 2026, 6:46 PM

యూపీఎస్సీ సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష 2026 నోటిఫికేష‌న్‌: ఖాళీల సంఖ్య‌, చివ‌రి తేదీ, ఇత‌ర వివ‌రాలు ఇవే..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్‌ను…

Thursday, 5 February 2026, 5:15 PM

తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో వైసీపీ హ‌యాంలో అక్ర‌మాలు జ‌రిగాయి: సీఎం చంద్ర‌బాబు

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…

Thursday, 5 February 2026, 4:00 PM

షుగ‌ర్ ఉన్న‌వారికి ప్ర‌ముఖ వైద్యుడు సూచించిన ఆరు సూప‌ర్ ఫుడ్స్‌..!

మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ‌డం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…

Thursday, 5 February 2026, 2:01 PM

భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదు.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన! టీ20 వరల్డ్ కప్‌లో ఉత్కంఠ.

భారత్‌తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…

Thursday, 5 February 2026, 10:47 AM

మార్చి రేసు నుంచి చరణ్, అడివి శేష్ అవుట్.. బాబాయ్ కోసమేనా? కారణాలివే!

మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ ప‌వన్…

Thursday, 5 February 2026, 10:13 AM