Tiger Nageswara Rao : యువ దర్శకుడు వశిష్ట ఒక పవర్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. బింబిసార చిత్రంతో హీరో కళ్యాణ్ రామ్ కెరియర్లో మర్చిపోలేని బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద బింబిసార చిత్రం నిర్మాతలకు కనకవర్షం కురిపిస్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ రూ.వంద కోట్ల సినిమా క్లబ్లో చేరుకోవడానికి దూసుకుపోతోంది.
ఇప్పుడు ఈ చిత్రంపైనే యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ లో జరుపుతున్న చర్చలు కొత్త మలుపులు తీసుకున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ వంటి చిత్రాల భారీ బడ్జెట్ తో పోల్చినప్పుడు, తక్కువ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ చేసే అవకాశం ఇతర నిర్మాతలకు ఆసక్తికరమైన విషయంగా మారింది.
బింబిసార బృందం పని నైపుణ్యం అందరినీ ఎంతగానో ఆకర్షించింది. బింబిసారకు ప్రయోగించిన విజువల్ ఎఫెక్ట్స్, రియలిస్టిక్ లుక్ అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి. అయితే రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావుకి కూడా బింబిసార చిత్రం మంచి స్ఫూర్తినిచ్చింది. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో 1960, 80 కాలాన్ని చూపించడానికి ఇలాంటి సాంకేతిక నైపుణ్యం ఉపయోగించనున్నారు.
టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో స్టువర్ట్ పురం గ్రామం సెట్ను రూపొందించడానికి బింబిసార బృందం ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ సాఫ్ట్ వేర్ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా టెక్నాలజీని వాడుకోవడానికి గల కారణం ఏమిటంటే.. ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు బృందం హైదరాబాద్లో రెండుసార్లు, రామోజీ ఫిలిం సిటీలో రెండుసార్లు, శంషాబాద్ ప్రాంతంలో మరొకసారి స్టువర్ట్ పురం గ్రామం సెట్స్ ను నిర్మించింది.
టైగర్ నాగేశ్వరరావు చిత్ర బృందానికి సీజీలో డిజిటల్ పొడిగింపును రూపొందించడంలో సవాల్ గా మారింది. ఇప్పుడు బింబిసార సాంకేతిక నైపుణ్యం ఒక మార్గం చూపించడంతో రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్ర బృందానికి కొత్త ఆశలు మొలకెత్తినట్లు అయింది. దీంతో బింబిసార టెక్నాలజీనే ఉపయోగించాలని టైగర్ నాగేశ్వర్ రావు టీమ్ ఆలోచిస్తోంది. ఇక వారి ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…