Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో త్వరలోనే ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ షో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మొత్తం 84 రోజుల పాటు షో జరగనుండగా.. దీన్ని టెలివిజన్లో కాకుండా ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. అందులో భాగంగానే ఈ షోను తొలిసారిగా రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ చేయదలిచారు. దీంతో ఈ షో పట్ల బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక ఈ షోకు గాను నిర్వాహకులు ప్రస్తుతం కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు కొందరు తెలుగు ఫీమేల్ యూట్యూబ్ స్టార్స్ను ఈ షో కోసం అడిగారట. అయితే ఈ షో విన్నర్ ప్రైజ్ మనీ మరీ తక్కువని తెలుస్తోంది. టీవీ బిగ్ బాస్ షోకు రూ.50 లక్షల నుంచి కొన్ని భాషల్లో రూ.1 కోటి వరకు ప్రైజ్ మనీని ఇస్తున్నారు. అయితే ఈ ఓటీటీ షోకు మాత్రం కేవలం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలను మాత్రమే విన్నర్కు ఇస్తామని చెప్పారట.
దీంతో సదరు ఫీమేల్ యూట్యూబ్ స్టార్స్ ఈ షోలో పాల్గొనలేమని చెప్పారట. ఎందుకంటే వారు అన్ని రోజుల పాటు హౌస్లో ఉంటే వారికి లభించే మొత్తం తక్కువే. అదే బయట ఉంటే యూట్యూబ్, ఇతర సోషల్ సైట్ల ద్వారా ఇంకా ఎక్కువగానే సంపాదిస్తారట. కనుక వారు ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారట. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీ నిర్వాహకులు దీనిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రైజ్ మనీని మరికాస్త పెంచితే ఈ ఆఫర్ కోసం ఎవరైనా సరే షోలో పాల్గొంటారని.. నిర్వాహకులు భావిస్తున్నారట. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…