Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో త్వరలోనే ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ షో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మొత్తం 84 రోజుల పాటు షో జరగనుండగా.. దీన్ని టెలివిజన్లో కాకుండా ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. అందులో భాగంగానే ఈ షోను తొలిసారిగా రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ చేయదలిచారు. దీంతో ఈ షో పట్ల బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక ఈ షోకు గాను నిర్వాహకులు ప్రస్తుతం కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు కొందరు తెలుగు ఫీమేల్ యూట్యూబ్ స్టార్స్ను ఈ షో కోసం అడిగారట. అయితే ఈ షో విన్నర్ ప్రైజ్ మనీ మరీ తక్కువని తెలుస్తోంది. టీవీ బిగ్ బాస్ షోకు రూ.50 లక్షల నుంచి కొన్ని భాషల్లో రూ.1 కోటి వరకు ప్రైజ్ మనీని ఇస్తున్నారు. అయితే ఈ ఓటీటీ షోకు మాత్రం కేవలం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలను మాత్రమే విన్నర్కు ఇస్తామని చెప్పారట.
దీంతో సదరు ఫీమేల్ యూట్యూబ్ స్టార్స్ ఈ షోలో పాల్గొనలేమని చెప్పారట. ఎందుకంటే వారు అన్ని రోజుల పాటు హౌస్లో ఉంటే వారికి లభించే మొత్తం తక్కువే. అదే బయట ఉంటే యూట్యూబ్, ఇతర సోషల్ సైట్ల ద్వారా ఇంకా ఎక్కువగానే సంపాదిస్తారట. కనుక వారు ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారట. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీ నిర్వాహకులు దీనిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రైజ్ మనీని మరికాస్త పెంచితే ఈ ఆఫర్ కోసం ఎవరైనా సరే షోలో పాల్గొంటారని.. నిర్వాహకులు భావిస్తున్నారట. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…