Bigg Boss 5 : బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో రోజు రోజుకూ కంటెస్టెంట్ ల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి. అయితే గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్ మాత్రం ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కార్యక్రమంలో సాయి తేజ్ అనే కమెడియన్ గా ఉన్న ఇతను సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారారు.
అయితే తన తండ్రికి కళ్లు కనిపించని నేపథ్యంలో తన ట్రాన్స్ జెండర్ గా ఆపరేషన్ చేయించుకున్న విషయం ఆయనకు తెలియలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే రోజు ఈ విషయాన్ని ప్రియాంక సింగ్ బిగ్ బాస్ వేదికపై నుంచి నాగార్జునతో చెబుతూ ఇప్పటి వరకు తన తండ్రికి ఈ విషయం తెలియదని తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పడానికి ఇంతకన్నా మంచి వేదిక ఉండదు.. అంటూ తన తండ్రికి తాను అమ్మాయిగా మారిన విషయాన్ని తెలియజేసింది.
ఇకపోతే ప్రియాంక సింగ్ పుట్టిన రోజు కావడంతో బిగ్ బాస్ తనకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు సందర్భంగా ప్రియాంక సింగ్ తండ్రి తనతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన ఆట తీరును ప్రశంసిస్తూనే ముందుగా బాబు సాయి తేజ్ అని పిలిచారు. తన తండ్రి ఇప్పటికీ అలాగే పిలవడంతో ప్రియాంక సింగ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రియాంక సింగ్ గతంలో పడిన బాధలను గుర్తుచేసుకోవడం, తండ్రీ కూతుర్ల మధ్య జరిగిన సంభాషణ బయటపెట్టడంతో ప్రియాంక సింగ్ బోరున విలపించింది. ఇది చూసిన మిగతా కుటుంబ సభ్యులు కూడా కంటతడి పెట్టుకున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…