Beauty Tips : సాధారణంగా మనకు అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. కొందరికి చర్మంపై ఎప్పుడూ ఏదో ఒక మచ్చలు వస్తుంటాయి. ఇంకొందరి చర్మం రంగు మారుతుంది. కొందరికి దురదలు వస్తుంటాయి. ఇలా రకరకాల చర్మ సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అలాగే కొందరికి మెడ భాగంలో నల్లగా మారుతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ మెడ భాగంలో నల్లగా మారితే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. అంద విహీనంగా కనిపిస్తారు. కనుక నల్లగా ఉండే మెడ భాగాన్ని మామూలుగా చేసుకోవాలని చూస్తుంటారు. అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా మెడ భాగంలో ఉండే నలుపు పోదు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల మెడ భాగంలో ఉండే నలుపు పోతుంది. దీంతోపాటు ఆ భాగంలో చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టీస్పూన్ పెరుగులో 4-5 నిమ్మరసం చుక్కలు కలిపి మిశ్రమంగా చేయండి. దీన్ని మెడ భాగంలో రాయాలి. 15 నిమిషాల పాటు ఉంచిన తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే కచ్చితంగా వారం రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.
నిమ్మరసం, పాల మిశ్రమాన్ని మెడపై రాయాలి. పదిహేను నిమిషాల తరువాత సున్నిపిండి అప్లై చేయాలి. మళ్లీ 15 నిమిషాలు ఆగాలి. ఆ తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తున్నా మెడ భాగంలో ఉండే నలుపు పోతుంది.
కాస్తంత పెరుగులో కొద్దిగా బియ్యం పిండిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని మెడ భాగంలో రాయాలి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మెడ భాగం అందంగా మారుతుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…