Beauty Tips : సాధారణంగా మనకు అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. కొందరికి చర్మంపై ఎప్పుడూ ఏదో ఒక మచ్చలు వస్తుంటాయి. ఇంకొందరి చర్మం రంగు మారుతుంది. కొందరికి దురదలు వస్తుంటాయి. ఇలా రకరకాల చర్మ సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అలాగే కొందరికి మెడ భాగంలో నల్లగా మారుతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ మెడ భాగంలో నల్లగా మారితే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. అంద విహీనంగా కనిపిస్తారు. కనుక నల్లగా ఉండే మెడ భాగాన్ని మామూలుగా చేసుకోవాలని చూస్తుంటారు. అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా మెడ భాగంలో ఉండే నలుపు పోదు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల మెడ భాగంలో ఉండే నలుపు పోతుంది. దీంతోపాటు ఆ భాగంలో చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టీస్పూన్ పెరుగులో 4-5 నిమ్మరసం చుక్కలు కలిపి మిశ్రమంగా చేయండి. దీన్ని మెడ భాగంలో రాయాలి. 15 నిమిషాల పాటు ఉంచిన తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే కచ్చితంగా వారం రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.
నిమ్మరసం, పాల మిశ్రమాన్ని మెడపై రాయాలి. పదిహేను నిమిషాల తరువాత సున్నిపిండి అప్లై చేయాలి. మళ్లీ 15 నిమిషాలు ఆగాలి. ఆ తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తున్నా మెడ భాగంలో ఉండే నలుపు పోతుంది.
కాస్తంత పెరుగులో కొద్దిగా బియ్యం పిండిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని మెడ భాగంలో రాయాలి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మెడ భాగం అందంగా మారుతుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…