Bangaram Girl : సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా మంది ఫేమస్ అవుతున్నారు. అలాగే బంగారం.. అనే డైలాగ్తో ఆ అమ్మాయి ఫేమస్ అయింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో అందరికీ బాగా పరిచయం అయింది. అయితే ఇంతకీ అసలు ఆమె ఎవరు.. ఆమె వివరాలు ఏమిటి.. అనే విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో అసలు ఆమె ఎవరు.. అన్న విషయం తెలిసిపోయింది. ఈ క్రమంలోనే ఆమె వీడియో వైరల్ అవుతోంది.
ఆ వీడియో చేసిన అమ్మాయి పేరు శాంతి. మతిస్థిమితం లేని శాంతి తండ్రి చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయాడు. కన్న తండ్రి కోసం కొన్నాళ్ళు ఊళ్లు, వీధులు పట్టుకొని తిరిగారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. శాంతికి తల్లితోపాటు ఓ తమ్ముడు ఉన్నాడు. 10వ తరగతి వరకు చదువుకుంది. కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో తన తల్లి దూషణకు గురైంది. కొందరు తన తల్లిని కొట్టారని చెబుతూ శాంతి ఆవేదన చెందింది.
సోషల్ మీడియాలో వీడియోలు చేయడం అలవాటు చేసుకున్న శాంతి కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంది. ఓ రోజు బంగారం నీ గురించి అందరూ అడుగుతున్నారు.. అంటూ తన లవర్ తో మాట్లాడుతున్నట్లు ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్యూట్ నెస్, ఇన్నోసెన్స్ కలగలిపి ముచ్చటగొలిపేలా ఉన్న ఆ వీడియో వైరల్ గా మారింది. దాంతో ఓవర్ నైట్ శాంతి ఫేమ్ తెచ్చుకుంది. ఆమె డైలాగ్ లను చెబుతూ వేలల్లో సోషల్ మీడియా వీడియోలు పుట్టుకొచ్చాయి. డీజే సాంగ్స్ చేశారు.
అయితే ప్రస్తుతం శాంతికి జబర్దస్త్ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె త్వరలోనే జబర్దస్త్ స్కిట్స్లో కనిపించనుందని అంటున్నారు. ఆమె జబర్దస్త్ స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. జబర్దస్త్ కమెడియన్స్ తో శాంతి కనిపించింది. దీంతో ఆమె త్వరలోనే జబర్దస్త్ వేదికపై కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఆమె షోలో ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి. దీంతో ఆమె జీవితమే మారిపోనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…