Bandla Ganesh : బండ్ల గణేష్ ఒకప్పుడు ఎంతో వార్తల్లో నిలిచారు. కానీ ఇప్పుడు ఆయన పెద్దగా బయట కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా ఆయన పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు. ఎప్పుడో ఒక పోస్ట్ తప్ప ఆయన దర్శన భాగ్యమే కరువైపోయింది. అయితే తాజాగా ఈయన మరోమారు వార్తల్లో నిలిచారు. ఓ అభిమాని వేసిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో తాను గొంతు కోసుకుంటానని.. బండ్ల గణేష్ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ ఆయన చెప్పిన పని మాత్రం చేయలేదు. దీంతో బండ్ల గణేష్ను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. బ్లేడ్ పట్టుకుని తిరుగుతూ.. బండ్ల గణేష్ ఎక్కడ.. అని చాలా మంది మీమ్స్ చేశారు.
అయితే ఆ ట్రోల్స్కు స్పందించిన బండ్ల గణేష్.. తనను వదిలేయాలని కోరారు. దీంతో ఆయనపై ట్రోల్స్ ఆగిపోయాయి. కానీ ఆయనపై తరచూ ఏదో ఒక విషయమై మీమ్స్ వస్తూనే ఉంటాయి. అయితే వాటికి ఆయన స్పందించరు. కానీ ట్విట్టర్లో పలువురు అభిమానులు అడిగే ప్రశ్నలకు మాత్రం ఆయన బదులిస్తుంటారు. ఇక తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన రిప్లై ఇచ్చారు.
బండ్ల అన్న.. మీరు అంటే నాకు చాలా అభిమానం.. మీరు బాగా మాట్లాడతారు. మీరు బీజేపీలో చేరితే బాగుంటుంది.. అని కోరాడు. దీంతో స్పందించిన బండ్ల గణేష్.. ప్లీజ్.. రాజకీయాలు మాట్లాడొద్దు.. అని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే బండ్ల గణేష్ ప్రస్తుతం రాజకీయాలు వదిలి సినిమాల నిర్మాణంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…