Shruti Haasan : జల్సా చిత్రం తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ చిత్రం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గబ్బర్ సింగ్ దర్శకనిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. ఈ సినిమాకు ముందు శృతిహాసన్ సైతం వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.
ఈ చిత్రంతో శృతి హసన్ లక్ మారిపోయింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శృతిహాసన్ గబ్బర్ సింగ్ తో మంచి విజయం అందుకుంది. చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ముందుగా శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి భయపడ్డానని ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ముందుగా శ్రుతిహాసన్ ను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని, కాబట్టి హీరోయిన్ గా ఆమెను తప్పించే ఆలోచన చేసినట్టు తెలిపారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కు వెళ్లి చెప్పగా.. నువ్వు అన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రమే తీశావా అంటూ తనపై పంచ్ వేశారని ఆ తర్వాత శృతినే సినిమాలో కంటిన్యూ అయిందని బండ్లగణేష్ వెల్లడించారు.
ఇక ఈ చిత్రం సక్సెస్ తో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ రేసుగుర్రం, బలుపు, ఎవడు, శ్రీమంతుడు వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది. గబ్బర్ సింగ్ చిత్రంతో అప్పటివరకు ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ ఆ తర్వాత హీరోలకు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ లో, బాలకృష్ణ NBK107 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లోనూ శృతిహాసన్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…