Balakrishna : అఖండ మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టిన నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ తరువాత కూడా ఆయన తీరిక లేకుండా సినిమాలు చేయనున్నారు. అయితే బాలకృష్ణ రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆయన ఒక్క మూవీకి ఎంత తీసుకుంటున్నారనే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
అఖండ సినిమాకు ముందు బాలయ్య ఒక్క మూవీకి రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకున్నారట. ఇక అఖండకు రూ.10 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాకు రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయనున్నారు. ఆ మూవీకి బాలయ్య రూ.15 కోట్లు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి మూవీకి బాలకృష్ణ రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్ను పెంచుతున్నారు.
అయితే హిట్, ఫ్లాప్ అనే దానితో సంబంధం లేకుండా బాలయ్య రెమ్యునరేషన్ తీసుకుంటుండడం విశేషం. కానీ ఆయన బోయపాటి డైరెక్షన్లో చేస్తున్న సినిమాలే హిట్ అవుతున్నాయి. మిగిలిన దర్శకులతో చేస్తే హిట్ దక్కడం లేదు. మరి ఆయన త్వరలో చేయనున్న రెండు సినిమాలు కూడా ఇతర దర్శకులవే. ఇవి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ను ఇస్తాయో చూడాలి. కానీ ప్రస్తుతం అగ్ర హీరోల నుంచి కుర్ర హీరోల వరకు రూ.30 కోట్లు కనీసం వసూలు చేస్తున్నారు. వారితో పోలిస్తే బాలకృష్ణ రెమ్యునరేషన్ తక్కువనే చెప్పాలి. కానీ ఆయన సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్న టాక్ కూడా ఉంది. కనుకనే నిర్మాతలు ముందు వెనుక చూడకుండా ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…