Virat Kohli : బాలీవుడ్ క్యూట్ కపుల్స్లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట ఒకటి. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన విరుష్క జంట డిసెంబరు 11న ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. ఈ అందమైన జంటకు 2021, జనవరి 11న కూతురు వామికా జన్మించింది. ప్రస్తుతం అనుష్క.. కూతురు బాగోగులు చూసుకుంటూ జీవితం గడుపుతోంది.
ఇక నవంబర్ 5న ఇండియన్ క్రికెట్ స్టార్ విరాట్కోహ్లీ తన 33వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. తన భార్య అనుష్క శర్మ పోస్ట్ చేసిన పోస్ట్ మాత్రం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తనదైన ప్రేమ నిండిన మనసుతో, ఎమోషనల్ కలగలిపి సోషల్ మీడియా వేదికగా అనుష్క తన పోస్ట్లో పేర్కొంది.
ఈ ఫొటోకు ఎలాంటి మెరుగులు అక్కర్లేదు. ఉక్కు సంకల్పం.. నిజాయితీతో కూడినది నీ వ్యక్తిత్వం. చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా లెక్క చేయక ముందుకు వెళ్లే ధైర్యం నీ సొంతం. నీలా చీకటి నుంచి అత్యున్నత శిఖరాలకు చేరగల వ్యక్తి మరొకరు ఉండరని నాకు తెలుసు. నీ మనసులో భయానికి తావులేదు. రోజురోజుకీ నువ్వు ఎదుగుతున్న విధానం అమోఘం. సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకునేంత తీరిక లేదని నాకు తెలుసు.
కొన్నిసార్లు నాకు బిగ్గరగా అరిచి చెప్పాలనిపిస్తుంది.. నీ అంతటి అత్యద్భుత వ్యక్తి మరొకరు లేరని ఈ ప్రపంచానికి చాటిచెప్పాలని ఉంటుంది. నువ్వంటే ఏమిటో తెలిసిన వాళ్లకు ఈ మాటలతో పనిలేదు. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రకాశవంతంగా.. మరింత అందంగా తీర్చిదిద్దుతున్నందుకు థాంక్యూ. హ్యాపీ బర్త్డే క్యూట్నెస్’’.. ఒక భార్యకు భర్తపై ఉన్న ప్రేమను తెలియజేసింది. అనుష్క పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…