Karate Kalyani : యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియో పేరిట అమ్మాయిలు, ఆంటీలను అసభ్యంగా చూపిస్తున్నాడని ఆరోపిస్తూ నటి కరాటే కల్యాణి తాజాగా అతనిపై దాడి చేసిన విషయం విదితమే. అయితే ఈ గొడవలో శ్రీకాంత్ రెడ్డి, కల్యాణి ఇద్దరూ ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే గొడవ పెద్దది కావడంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే అతనిదే తప్పని కల్యాణి అంటుంటే.. ఆమెదే తప్పని శ్రీకాంత్ అంటున్నాడు. తనను రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసిందని.. లేదంటే వేధింపులకు పాల్పడుతున్నావంటూ కేసు పెడతానని.. మహిళా సంఘాలకు చెబుతానని.. కల్యాణి తనను బెదిరించిందని.. చివరకు ఆమె వద్ద ఉన్న ఓ వ్యక్తి రూ.70వేలు ఇస్తే అంతా సెటిల్ చేస్తానని చెప్పాడని.. శ్రీకాంత్ తెలిపాడు.
ఇక కల్యాణి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. ఒక బంధువుల అమ్మాయి తన వద్దకు వచ్చి శ్రీకాంత్ గురించి చెప్పిందని.. దీంతో అతన్ని పద్ధతి మార్చుకోవాలని.. ప్రాంక్ వీడియోలు చేయొద్దని.. అమ్మాయిలు, ఆంటీలను అలా అసభ్యంగా చూపించడం మానుకోవాలని.. అతనికి చెప్పానని కల్యాణి తెలిపారు. అయితే అతను మాత్రం పొగరుగా మాట్లాడుతూ.. తాను ఒక్కో అమ్మాయికి లేదా ఆంటీకి రూ.15వేలు ఇచ్చి వీడియోలు చేయించుకుంటున్నానని.. అందులో మీకు వచ్చిన ఇబ్బందేమి ఉందని.. అతను ప్రశ్నించాడని కల్యాణి అన్నారు. అయితే అతను రూ.2 లక్షలు ఇస్తాను.. మీరు కూడా అలాంటి వీడియోలు చేయవచ్చు కదా.. అని అడిగాడని.. అందుకనే కోపం వచ్చి కొట్టానని.. అతన్ని విడిచిపెట్టేది లేదని కల్యాణి ఆరోపించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ బాగానే జరిగింది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంకో వ్యక్తి కల్యాణిపై ఫిర్యాదు చేశాడు.
కరాటే కల్యాణి తనను బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపిస్తూ.. గోపీకృష్ణ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఓ ఇంటి విషయంలో కల్యాణి తనను బెదిరించిందని.. రూ.3.50 లక్షలు వసూలు చేసిందని తెలిపాడు. ఇవ్వకపోతే పురుగుల మందు తాగిన వీడియోను పంపి తమను భయపెట్టిందని.. అందుకనే డబ్బులు ఇచ్చానని.. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని గోపీకృష్ణ తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే అసలు ఈ ఇంటి వ్యవహారం ఏమిటి.. దీనికి కల్యాణితో సంబంధం ఏంటి ? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దీనిపై కల్యాణి కూడా స్పందించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…