ఆంధ్ర‌ప్ర‌దేశ్

కడుపులో ఉన్నది బిడ్డ కాదు.. గడ్డ స్కానింగ్ లో బయటపడ్డ నిజాలు..

గర్భం దాల్చారని వైద్యులు ఆ మహిళకు చెప్పడంతో తాను తల్లి కాబోతున్నానని ఎంతో సంబరపడిపోయింది. తన బిడ్డ కోసం ఎన్నో కలలు కనింది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి నెల వైద్య పరీక్షలు చేయిస్తూన్న వైద్యులు బిడ్డ ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. అయితే ఆమెకు 9 నెలలు పూర్తి అయి పదవ నెల కూడా పూర్తి కావస్తున్న పురిటినొప్పులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. ఈ స్కానింగ్ లో ఎవరూ ఊహించనటువంటి నిజాలు బయటపడ్డాయి. తన కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదు గడ్డ అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఎంతో షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయవాడ గులాబీ తోటకు చెందిన కె.సుధారాణి(21)కి శ్రీకాకుళానికి చెందిన సంతోష్‌తో వివాహం జరిగింది. ఏడో నెల గర్భిణిగా ఉన్న సుధారాణి పురుడు కోసం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె విజయవాడలోనే పాత ఆస్పత్రిలోని మాతాశిశు విభాగంలో వైద్య పరీక్షల కోసం వస్తోంది. మూడునెలల నుంచి ఆస్పత్రికి వస్తున్న ఆమె కడుపులో బిడ్డ ఏ విధంగా ఉందని వైద్యులు పరీక్షించ లేదు.బిడ్డ ఆరోగ్యం గానే ఉంది నొప్పులు రాగానే ఆస్పత్రికి రండి అని చెప్పి సిబ్బంది పంపించారు.అయితే ఆమెకి 10 వ నెల పూర్తి కావస్తున్న పురిటినొప్పులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఒకసారి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు.

ఈ విధంగా స్కానింగ్ చేయడం వల్ల తన కడుపులో బిడ్డ కాదు పెరిగేది గడ్డ అని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎంతో షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం విజయవాడ పాత ఆస్పత్రి వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇంతటి దారుణం జరిగిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోవటం వల్లే బాధితులకు స్కానింగ్ చేయలేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బిడ్డ పెరుగుదల ఆగిపోవడం వల్లే ఈ విధంగా ఇన్ఫెక్షన్ కి దారితీసింది ఉందని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM

త్రిష వర్సెస్ పార్థిబన్.. నటి సీరియస్ కౌంటర్! ‘మైక్ ఉంటే ఏదైనా మాట్లాడతారా?’

త‌మిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను న‌టి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేర‌కు త్రిష త‌న…

Monday, 9 March 2026, 3:22 PM

బెంగళూరులో ఎన్టీఆర్ మేనియా.. ఆసుపత్రి ఓపెనింగ్‌లో భారీ తోపులాట, ఎస్కలేటర్ ధ్వంసం!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…

Monday, 9 March 2026, 10:01 AM