గర్భం దాల్చారని వైద్యులు ఆ మహిళకు చెప్పడంతో తాను తల్లి కాబోతున్నానని ఎంతో సంబరపడిపోయింది. తన బిడ్డ కోసం ఎన్నో కలలు కనింది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి నెల వైద్య పరీక్షలు చేయిస్తూన్న వైద్యులు బిడ్డ ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. అయితే ఆమెకు 9 నెలలు పూర్తి అయి పదవ నెల కూడా పూర్తి కావస్తున్న పురిటినొప్పులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. ఈ స్కానింగ్ లో ఎవరూ ఊహించనటువంటి నిజాలు బయటపడ్డాయి. తన కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదు గడ్డ అని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఎంతో షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
విజయవాడ గులాబీ తోటకు చెందిన కె.సుధారాణి(21)కి శ్రీకాకుళానికి చెందిన సంతోష్తో వివాహం జరిగింది. ఏడో నెల గర్భిణిగా ఉన్న సుధారాణి పురుడు కోసం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె విజయవాడలోనే పాత ఆస్పత్రిలోని మాతాశిశు విభాగంలో వైద్య పరీక్షల కోసం వస్తోంది. మూడునెలల నుంచి ఆస్పత్రికి వస్తున్న ఆమె కడుపులో బిడ్డ ఏ విధంగా ఉందని వైద్యులు పరీక్షించ లేదు.బిడ్డ ఆరోగ్యం గానే ఉంది నొప్పులు రాగానే ఆస్పత్రికి రండి అని చెప్పి సిబ్బంది పంపించారు.అయితే ఆమెకి 10 వ నెల పూర్తి కావస్తున్న పురిటినొప్పులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఒకసారి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు.
ఈ విధంగా స్కానింగ్ చేయడం వల్ల తన కడుపులో బిడ్డ కాదు పెరిగేది గడ్డ అని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎంతో షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం విజయవాడ పాత ఆస్పత్రి వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇంతటి దారుణం జరిగిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోవటం వల్లే బాధితులకు స్కానింగ్ చేయలేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బిడ్డ పెరుగుదల ఆగిపోవడం వల్లే ఈ విధంగా ఇన్ఫెక్షన్ కి దారితీసింది ఉందని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…