వారసత్వంగా వచ్చిన ఇంటిని కాపాడుకోవడం కోసం ఎనిమిది పదుల వయసులో ఉన్న ఓ వృద్ధురాలు తనకు న్యాయం కావాలంటూ కోర్టు మెట్లెక్కింది.తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న ఇంటిని కాపాడుకోవడం కోసం న్యాయపోరాటం చేస్తోంది.ఈ క్రమంలోనే తన తరఫున కేసు వాదించడానికి లాయర్ కు డబ్బు చెల్లించడం కోసం వృద్ధురాలు రోడ్డెక్కి భిక్షాటన చేస్తున్న ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కడపకు చెందిన భూరుగుల రాజమ్మకు తన తల్లిదండ్రుల నుంచి ఆస్తిగా వచ్చిన తన ఇంటిని కాపాడుకుంటూ ఉంది.అయితే గత కొద్ది సంవత్సరాల క్రితం రాజమ్మ భర్త చనిపోవడంతో కొంత డబ్బు అవసరమైతే ఆ ఇంటిని సాంబయ్య అనే వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టి కొంత డబ్బులు తీసుకుంది. మూడు సంవత్సరాలలోగా తను తీసుకున్న డబ్బులు చెల్లిస్తానని అగ్రిమెంట్ రాయించుకున్నారు. అయితే సదరు వ్యక్తి డబ్బు చెల్లించిన ఏడాదిలోగా తిరిగి వచ్చి డబ్బులు చెల్లించాలని లేకపోతే ఇంటిని సొంతం చేసుకుంటానని బెదిరించాడు.
రాజమ్మ పెద్దగా చదువుకోకపోవడంతో ఇంటిని తన పేరుపై మార్చుకోవడమే కాకుండా ప్రస్తుతం ఆ ఇల్లు తన పేరుపై ఉందని కోర్టుకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే రాజమ్మ కోర్టుకు వెళ్లి తన ఇంటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.అయితే తన కేసును వాదించడానికి లాయర్ కి చెల్లించాల్సిన ఫీజు కూడా తనవద్ద లేదని అందుకోసమే భిక్షాటన చేస్తున్నానని రాజమ్మ రోడ్డెక్కి భిక్షాటనకు దిగారు. ఈ క్రమంలోనే దాతలు ఎవరైనా తనకు సహాయం చేసి తనఇంటిని తనకు దక్కేలా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…