Anchor Suma : బుల్లితెర యాంకర్గా సత్తా చాటుతూ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది సుమ. ప్రస్తుతం జయమ్మగా తెగ హడావిడి చేస్తోంది. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఈమె సిల్వర్ స్క్రీన్పై జయమ్మగా సందడి చేయడానికి సిద్ధమైంది. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ మే 6న రిలీజ్ కానుంది. బుధవారం ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ను సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది.
వెన్నెల క్రియేషన్స్ పతాకంపై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రానికి అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. ఎక్కువ రీచ్ సంపాదించేందుకు నిర్విరామంగా ఇంటర్వ్యూలు, ప్రమోషన్ కార్యక్రమాలో పాల్గొంటోంది సుమ. అయితే తాజాగా తన చేతిపై వెంకన్న అనే పచ్చబొట్టు కనిపించగా.. దాని గురించి బదులిచ్చింది.
ఆ పచ్చబొట్టు గురించి తెలియాలంటే జయమ్మ పంచాయతీ సినిమా చూడాల్సిందేనని తెలిపింది. సెకండ్ ఆఫ్ లో దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలుస్తుందని చెప్పింది. విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమ కనకాలతోపాటు ఈ చిత్రంలో పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీని అనుష్క కుమార్ అందించగా, ఎడిటర్ రవితేజ గిరిజాల. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…