Sreemukhi : బుల్లితెర యాంకర్లలో మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో యాంకర్ సుమ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే సుమ తరువాత ఆ రేంజ్లో పాపులర్ అయిన యాంకర్ ఎవరు.. అంటే.. మనకు గుర్తుకు వచ్చేది శ్రీముఖినే అని చెప్పవచ్చు. యాంకర్ సుమ లాగే శ్రీముఖి కూడా బాగా మాట్లాడగలదు. ఈవెంట్ లేదా షో, ప్రోగ్రామ్ ఏదైనా సరే.. సుమ లాగే శ్రీముఖి సందడి చేస్తుంటుంది. ముఖ్యంగా శ్రీముఖి యువతకు బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికే పలు షోల ద్వారా శ్రీముఖి యూత్లో ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. అయితే రెమ్యునరేషన్ విషయంలోనూ సుమకు పోటీగా శ్రీముఖి వస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా తన రెమ్యునరేషన్ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.
యాంకర్ సుమ ఒక్క కాల్షీట్కు రూ.5 లక్షలు తీసుకుంటుండగా.. ఆమె తరువాత రెండో స్థానంలో శ్రీముఖి నిలిచిందని చెప్పవచ్చు. శ్రీముఖి ఒక్క కాల్షీట్కు రూ.3 లక్షల వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం. శ్రీముఖి తన వాక్చాతుర్యంతో ఇప్పటికే ఎంతో మందిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. అయితే శ్రీముఖి యాంకర్గానే కాదు.. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కానీ ఈమెకు సినిమాల ద్వారా అంత గుర్తింపు రాలేదు. షోల ద్వారానే బాగా గుర్తింపు వచ్చింది.
ఇక ప్రస్తుతం బుల్లితెర టాప్ యాంకర్లలో సుమ, శ్రీముఖి, అనసూయ ఉన్నారని చెప్పవచ్చు. కానీ అనసూయ టీవీ షోలలో తక్కువగా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక సుమ, శ్రీముఖి మాత్రమే టీవీ షోలలో బాగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉన్నారు. అయితే శ్రీముఖి ఈ రేంజ్లో రెమ్యునరేషన్ను తీసుకుంటుండడంతో ముందు ముందు ఈమె ఇంకా ఎంత డిమాండ్ చేస్తుందోనని చర్చించుకుంటున్నారు. మరి ఈమెకు సినిమాల్లో ఏమైనా చాన్స్లు వచ్చి దశ తిరుగుతుందేమో చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…