Anasuya : గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠతో కొనసాగిన మా ఎన్నికలకు ఎట్టకేలకు తెరపడి ఫలితాలు వచ్చాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొంది సంచలనం సృష్టించారు. దీంతో నాగబాబు, ప్రకాష్ రాజ్లు మా సభ్యత్వానికి రాజీనామాలు కూడా చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఈసీ మెంబర్గా పోటీ చేసిన అనసూయ తన సోషల్ ఖాతాల్లో షాకింగ్ కామెంట్లు చేసింది.
ప్రకాష్ రాజ్ ప్యానెల్లో అనసూయ ఈసీ మెంబర్గా పోటీ చేసి గెలుపొందింది. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ గెలవకపోవడంతో ఆమెతోపాటు గెలిచిన ఇతర సభ్యులకు విచారంగా ఉంది. అయితే అనసూయ తన సోషల్ ఖాతాల్లో చేసిన పోస్ట్లు షాకింగ్గా మారాయి. నిజానికి ఆమె గెలిచిందని ఆదివారం రాత్రి ప్రకటించారు. కానీ తెల్లారేసరికి ఆమె ఓడిపోయిందని చెప్పారు. దీనిపై కూడా అనసూయ పోస్టు పెట్టడం విశేషం.
తాను ఇకపై ఎప్పటికీ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని.. రాజకీయాల్లో ఉంటే నిజాయితీగా ఉండలేమని.. అందుకు తనకు సమయం కూడా లేదని.. తనకు తన పిల్లల భవిష్యత్తే ముఖ్యమని.. అనసూయ తన సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. అలాగే తాను గుణపాఠం నేర్చుకున్నానని కూడా అందులో కామెంట్ పెట్టింది. దీంతో ఆమె మా ఎన్నికలను ఉద్దేశించే వ్యాఖ్యలు చేసిందని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
నిజానికి అనసూయ అంటే చాలా మంది అభిమానిస్తారు. కానీ ఆమె ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఈసీ మెంబర్గా పోటీ చేయడం వల్ల కొందరికి దూరం అయిందని చెప్పవచ్చు. అందువల్లే ఆమె విచారంగా ఈ పోస్టు పెట్టిందని తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్లో గెలిచిన వారు రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరి వారు ఏం చేస్తారో చూడాలి..!
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…