Amani : తెలుగు సినీ ప్రేక్షకులకు సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎలాంటి గ్లామర్ షో చేయకపోయినా కేవలం తన నటనతోనే ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని చూరగొంది. దక్షిణాదికి చెందిన ఎన్నో చిత్రాల్లో నటించి అనేక అవార్డులను కూడా పొందింది. అయితే బీజేపీకి చెందిన ఎన్నికల ప్రచారం పాల్గొనబోతూ ఈమె విమాన ప్రమాదంలో కన్నుమూసింది. ఈ క్రమంలోనే సౌందర్య 50వ జయంతి సందర్భంగా ఈమధ్యే అభిమానులు ఆమె గురించి తలచుకుని విచారం వ్యక్తం చేశారు. ఒక గొప్ప నటిని కోల్పోయామని ఆమె గురించి అనేక పోస్టులు పెట్టి సంతాపం తెలిపారు.
ఇక సౌందర్య తన నటనకు గాను ఎన్నో అవార్డులను కూడా పొందింది. కన్నడలో వచ్చిన ద్వీప అనే మూవీకి గాను ఈమె నేషనల్ అవార్డును సాధించగా.. మరో రెండు నంది అవార్డులను, పలు ఫిలిం ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తెలుగులో ఈమె మొదటి చిత్రం మనవరాలి పెళ్లి. తరువాత వరుసగా రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, హలో బ్రదర్, నంబర్ వన్, అమ్మోరు.. వంటి చిత్రాల్లో నటించింది. ఇవి ఆమెకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టాయి. అయితే సౌందర్య ఎన్నో చిత్రాల్లో నటించినా గ్లామర్ను ప్రదర్శించలేదు. అందాలను ఆరబోయలేదు. హద్దులు మీరి కూడా ప్రవర్తించలేదు. పద్ధతిగా నడుచుకుంది. అయితే సౌందర్య ఇలా ఎందుకు ఉంది ? అన్న వివరాలు తెలియవు. కానీ వీటిని సీనియర్ నటి ఆమని తెలియజేసింది.
అప్పట్లో ఆమని, సౌందర్య మంచి స్నేహితులు. ఆమె చనిపోయాక ఆమని చాలా బాధపడింది. అయితే ఇటీవల ఆమని ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సౌందర్య గురించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. సౌందర్య ఎందుకు గ్లామర్ షో చేయలేదో చెప్పింది. తాను గ్లామర్ షో చేయనని.. రేపు పెళ్లయ్యాక తన భర్త ప్రశ్నిస్తే తాను ఏం సమాధానం చెప్పాలని సౌందర్య అంటుండేదని.. అలాగే రేపు పెళ్లి అయి పిల్లలు పుట్టాక వారితో కలసి తన సినిమాలు చూస్తుంటే వాటిలో తన గ్లామర్ షోను చూసి పిల్లల ముందు తలదించుకోవాల్సి వస్తుందని.. కనుక ఆ పరిస్థితి రాకూడదని చెప్పే తాను గ్లామర్ షో చేయడం లేదని.. సౌందర్య అప్పట్లో తనతో ఈ విషయాలను చెప్పిందని.. ఆమని తెలియజేసింది. అయితే కుటుంబ పరువు ప్రతిష్టలకే సౌందర్య ఎక్కువ విలువ ఇచ్చేదని.. ఒక గొప్ప నటిని మాత్రమే కాకుండా, మంచి స్నేహితురాలిని కూడా కోల్పోయానని.. ఆమని చెప్పింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…