Amala Paul : నటి అమలా పాల్ ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 2014 లో తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ ని పెళ్లి చేసుకున్న ఈమె 2017లో అతనికి విడాకులు ఇచ్చేసింది. ఆ తరువాత 2018లో భవిందర్ సింగ్ అనే రాజస్థాన్ కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుండి ఎదో ఒక వివాదం ఆమెను చుట్టు ముడుతూనే ఉంది. ఆ తరువాత వారిద్దరూ కలిసి ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు.
నవంబర్ 2020 లో అమలా పాల్ అతనిపై పరువు నష్టం కేసు వేసింది. తామిద్దరం కలిసి 2018లో దిగిన ఫోటోషూట్ కి చెందిన తన వ్యక్తిగత ఫోటోలను భవిందర్ తన అనుమతి లేకుండా సామాజిక మాధ్యమాలలో షేర్ చేశాడని, దాని వలన తాను మానసిక క్షోభను, ఒత్తిడిని ఎదుర్కొన్నాని పేర్కొంటూ అతనిపై మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. అప్పట్లో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే అవి కేవలం ఫోటోషూట్ లో భాగంగా తీసిన చిత్రాలే అని అమలా పాల్ వివిరణ ఇచ్చింది. దాంతో వారి రిలేషన్ షిప్ కి బ్రేక్ పడిపోయింది.
అయితే ఇప్పుడు అమలా పాల్ తాజాగా భవిందర్ సింగ్ పై మరో కేసు వేసింది. భవిందర్ ఇంకా అతని కుటుంబ సభ్యులు కలిసి తమ భాగస్వామ్య నిర్మాణ సంస్థలో నుండి తనును డైరెక్టర్ గా తొలగించి నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా తన ఆస్తులను కాజేశారని తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా భవిందర్ తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు దిగిన తన వ్వక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో అమలా పాల్ మాజీ ప్రేమికుడైన భవిందర్ సింగ్ ను తమిళనాడులోని విల్లుపురం జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసులు చీటింగ్ ఇంకా వేధింపుల కేసు కింద అరెస్టు చేశారు.
ప్రస్తుతం అమలా పాల్ కీలక పాత్రలో నటించిన కడవెర్ అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. ఇంకా తను మళయాల నటుడు మమ్ముట్టితో చేసిన క్రిస్టోఫర్ అలాగే పృథ్వీరాజ్ తో చేసిన ఆడుజీవితం అనే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…