Ajay Bhupathi : ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అజయ్ రెండో సినిమాగా మహా సముద్రం చేశాడు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరి, అనుఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 14న విడుదలైంది.
మహా సముద్రం చిత్రంపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్న అజయ్ భూపతికి నిరాశే ఎదురైంది. ‘మహా సముద్రం’ ఒక వయొలెంట్ లవ్స్టోరీ. ఎమోషనల్గా సాగే ప్రేమకథ. ఈ సినిమాకు స్టోరీనే హీరో. అక్టోబర్ 14న తెలుగు సినిమా ఇండస్ట్రీ మరో బ్లాక్బస్టర్ మూవీని చూడబోతుంది. ఇది రాసుకోండి.. అంటూ సినిమా రిలీజ్కి ముందు తెగ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అజయ్. కానీ మూవీ నిరాశపరచడంతో సైలెంట్ అయిపోయాడు.
మహా సముద్రం చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బలం లేని కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమా థియేటర్లకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇదే విషయమై ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ‘మహా సముద్రం సినిమాను ఏంటి అన్న అలా తీశావు. చాలా ఊహించుకున్నాం’ అని ట్వీట్ చేయగా, దీనికి బదులిచ్చిన అజయ్.. ‘మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి. మరోసారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తా’ అంటూ ట్వీట్ చేశాడు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…