Airtel : దేశవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు ఎయిర్టెల్ శుభవార్త చెప్పింది. దేశంలోని పలు ఎంపిక చేసిన నగరాల్లో 5జి సేవలను శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సులో పాల్గొన్న ఆయన తమ నెట్వర్క్లో 5జి సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.
కాగా ఎయిర్టెల్ 5జి సేవలు మొత్తం 8 నగరాల్లో నేటి నుంచి లభ్యం కానున్నాయి. వాటిల్లో హైదరాబాద్ కూడా ఉంది. ఇక మిగిలిన నగరాల విషయానికి వస్తే.. ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, ముంబై, చెన్నై, సిలిగురి తదితర నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో శనివారం నుంచే 5జి సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్టెల్ తెలియజేసింది. ఇక వచ్చే ఏడాది మార్చి వరకు దేశంలో అన్ని చోట్లా 5జి సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎయిర్ టెల్ ప్రతినిధులు తెలియజేశారు.
కాగా గతంలో నిర్వహించిన 5జి స్పెక్ట్రమ్ వేలంలో రూ.43వేల కోట్లకు గాను ఎయిర్టెల్ 19,867.8 మెగాహెడ్జ్లో బ్యాండ్ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే గతేడాది నుంచే నోకియా, ఎరిక్సన్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు గతంలోనే ఎయిర్ టెల్ వెల్లడించింది. అయితే మరోవైపు జియో కూడా 5జి సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కానీ జియో 5జి సేవలు ప్రస్తుతం చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. ఆ లిస్ట్లో హైదరాబాద్ లేదు. కానీ హైదరాబాద్ వాసులకు ఎయిర్టెల్ ముందుగా 5జి సేవలను అందుబాటులోకి తెచ్చింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…