Aha OTT : కరోనా నేపథ్యంలో ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువైంది. చాలా వరకు సినిమాలు గత 2 సంవత్సరాల నుంచి ఓటీటీల్లోనే విడుదల కాగా.. ఇప్పుడిప్పుడే మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అయినప్పటికీ ఓటీటీలకు ఆదరణ తగ్గడం లేదు. కొత్త సినిమా విడుదలయ్యాక థియేటర్ల కన్నా నెల రోజులు ఆగితే ఏకంగా ఓటీటీలోనే చూడవచ్చని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. కనుక టీవీల్లో సినిమాలు చూసే రోజులు కూడా పోయాయని చెప్పవచ్చు. ఓటీటీల్లోనే యాడ్స్ లేకుండా ఎంచక్కా ప్రేక్షకులు సినిమాలను వీక్షిస్తున్నారు. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ప్లాట్ ఫామ్లో త్వరలో30 సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
హాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం మన దేశంలో ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. హిందీ, తమిళం, మళయాళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీలను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆహా తన ప్లాట్ఫామ్పై 30 ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీలను రానున్న రోజుల్లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. సదరు మూవీలను ప్రతి శుక్రవారం ఒకటి చొప్పున రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆహా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ సినిమాలు ప్రతి శుక్రవారం ఒకటి రిలీజ్ కానుండగా.. వాటిల్లో స్పైడర్ మ్యాన్ సిరీస్ మూవీలు, మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ మూవీలు, సాల్ట్.. ఇతర ప్రముఖ హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఆహా ఓటీటీ యాప్లో త్వరలో తెలుగు వెర్షన్లో లభ్యం కానున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదం లభ్యం కానుంది. అయితే ఈ మూవీలను ఎప్పుడు రిలీజ్ చేసేది వెల్లడించలేదు. కానీ ఈ నెలాఖరు నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…