Anchor Devi : నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లి మధ్య జరిగిన గొడవ గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే 99 శాతం మంది విశ్వక్ సేన్కే తమ మద్దతు తెలుపుతున్నారు. దేవి చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటున్నారు. ఒక హీరోను స్టూడియోకు పిలిచి అవమానించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ముందుగా దేవి ఆయనను తిట్టబట్టే ఆయన ఆవేశంలో అలా మాట్లాడాడని.. కనుక దేవి సహనం కోల్పోయిందని అంటున్నారు. ఇక ఇదే విషయమై ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అనేక మంది విమర్శిస్తున్నారు.
అయితే లేటెస్ట్గా ప్రముఖ హేతువాది బాబు గోగినేని కూడా ఈ విషయంలో ఎంటర్ అయ్యారు. ఆయన విశ్వక్ సేన్కు సపోర్ట్ గా నిలిచారు. ప్రాంక్ వీడియో చేస్తే ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ హెచ్ఆర్సీ దాకా వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే గతంలోనూ దేవి ఇలాగే నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిందని.. దానిపై ఎందుకు ఆమె మాట్లాడడం లేదని అన్నారు. ఇక ఆమె జర్నలిజం వీడియోలను షేర్ చేస్తూ ఆయన దేవి పరువు తీశారు. కనీస జ్ఞానం లేకుండా ఆమె జర్నలిస్టు ఎలా అయ్యింది.. ఆమెకు సైన్స్ అసలు తెలియదు.. అంటూ ఆమె రిపోర్టింగ్ చేసిన ఓ వీడియోను కూడా బాబు గోగినేని షేర్ చేసి ఆమెకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయనే ఇంకో పోస్టు ద్వారా మళ్లీ స్పందించారు.
మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం దేవి అలా మాట్లాడకూడదని.. ఒక వ్యక్తిని డిప్రెస్డ్ అని, మానసిక రోగి, మెంటల్ అని అనవద్దని.. కేవలం చికిత్స తీసుకునేటప్పుడే అలా మాట్లాడాలని.. కనుక దేవి చేసింది పెద్ద నేరమని అన్నారు. అందుకు 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని.. హైకోర్టు న్యాయవాది ప్రమోద్ రెడ్డి తెలిపారని.. అన్నారు. అయితే బాబు గోగినేని ఈ విధంగా వరుస పోస్టులతో దేవిపై విరుచుకు పడుతుండడంతో ఆయన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…