Aha : ప్రస్తుత తరుణంలో ఓటీటీలకు ప్రేక్షకుల నుంచి ఎంతటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. కరోనా పుణ్యమా అని ఓటీటీల బిజినెస్ ఒక్కసారిగా పెరిగింది. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడంతో ఓటీటీలపై ప్రేక్షకులు ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోయినా ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడడం వల్ల థియేటర్ల వైపు వెళ్లడం లేదు. రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట వంటి మూవీలకు తొలి రోజే థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపించాయి. అంటే పెరిగిన టిక్కెట్ల ధరలతోపాటు ఓటీటీల ప్రభావం వారిపై పడిందన్నమాట. అందులో భాగంగానే ఓటీటీ యాప్స్ కూడా కొత్త కొత్త సినిమాలను తమ ప్లాట్ఫామ్లపై విడుదల చేస్తున్నాయి.
థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయిన తరువాత కేవలం 3 వారాల్లోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. దీంతో థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ యాప్స్ లేటెస్ట్ మూవీలను విడుదల చేస్తున్నాయి. అయితే కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ లతో పోటీ పడుతున్న ఆహా తాజాగా తన ప్రేక్షకులు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ప్లాట్ఫామ్పై మొత్తం 30 హాలీవుడ్ డబ్బింగ్ మూవీలను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆహా ట్వీట్ చేసింది.
ఇందులో భాగంగా ఆహా ప్రతి శుక్రవారం పలు హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలను తన ప్లాట్ఫామ్పై విడుదల చేయనుంది. ఇక ఈ శుక్రవారం.. అంటే.. మే20వ తేదీన మెన్ ఇన్ బ్లాక్ 3, ది అడ్వెంచర్స్ ఆఫ్ టిన్ టిన్, రెసిడెంట్ ఈవిల్, రెసిడెంట్ ఈవిల్ ఎక్స్టింక్షన్, జాంగో అన్చెయిన్డ్ వంటి హాలీవుడ్ బ్లాక్బస్టర్స్ను రిలీజ్ చేయనున్నట్లు తెలియజేసింది. వీటిని తెలుగు ప్రేక్షలకు సౌకర్యార్థం తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక మొత్తం 30 మూవీలను ఒకేసారి కాకుండా విడతల వారిగా రిలీజ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. వచ్చే శుక్రవారం మరికొన్ని మూవీలు ఆహాలో రానున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…