Adipurush : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ఆదిపురుష్.. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా చేస్తోంది. ఇక రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు.
అత్యంత భారీ బడ్జెట్తో 3డిలో ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. దాదాపుగా రూ.400 కోట్లతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి 3 నెలలకు పైగానే అవుతోంది. మరోవైపు పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యేందుకే కొన్ని ఏళ్లు పడుతుందని అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తూ ఈ చిత్ర షూటింగ్ కేవలం 103 రోజుల్లోనే పూర్తయింది. అవును.. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ స్వయంగా తెలియజేశారు.
ఆది పురుష్ మూవీ షూటింగ్ 103 రోజుల్లో పూర్తయ్యింది. ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.. అని అన్నారు. కాగా ఈ మూవీని భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మించారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్ మూవీతోనూ అలరించనున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…