Adipurush : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ఆదిపురుష్.. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా చేస్తోంది. ఇక రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు.
అత్యంత భారీ బడ్జెట్తో 3డిలో ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. దాదాపుగా రూ.400 కోట్లతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి 3 నెలలకు పైగానే అవుతోంది. మరోవైపు పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యేందుకే కొన్ని ఏళ్లు పడుతుందని అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తూ ఈ చిత్ర షూటింగ్ కేవలం 103 రోజుల్లోనే పూర్తయింది. అవును.. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ స్వయంగా తెలియజేశారు.
ఆది పురుష్ మూవీ షూటింగ్ 103 రోజుల్లో పూర్తయ్యింది. ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.. అని అన్నారు. కాగా ఈ మూవీని భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మించారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్ మూవీతోనూ అలరించనున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…