Laya : అందం, అభినయంతో ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసింది అందాల తార లయ. స్వయంవరం, ప్రేమించు, నీ ప్రేమకై వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపుగా 60 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అలనాటి అందాల తార హీరోయిన్ లయ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ మూవీస్ పై తనకున్న ఇష్టాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది.
కేవలం ఫ్యామిలీ విషయాలు మాత్రమే కాకుండా ట్రెండీ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను ఆక్టటుకుంటుంది. ఇప్పటికే పలు హిట్ సాంగ్స్కు స్టెప్పులేసి అదరగొట్టిన లయ.. తాజాగా మరోసారి నెట్టింట రచ్చ చేసింది. లయ తన కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సిద్దు జొన్నలడ్డ నటించిన రీసెంట్ మూవీ డీజే టిల్లు సినిమాలోని టైటిల్ సాంగ్ డీజే టిల్లుకి.. తల్లీకూతుళ్లు మాస్ డ్యాన్స్ ఇరగదీశారు. నెటిజన్స్ లైకులు కొడుతూ కామెంట్స్ పెడుతున్నారు.
అద్భుతంగా డ్యాన్స్ చేశారని.. సూపర్.. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లయ యూఎస్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే ఓ ఎన్నారై డాక్టర్ను పెళ్లి చేసుకొని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో సెటిలైంది లయ. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఒక బాబు, పాప కూడా ఉన్నారు. ఆ మధ్య రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో తన కూతురు శ్లోకతో కలిసి నటించింది లయ.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…