Laya : అందం, అభినయంతో ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసింది అందాల తార లయ. స్వయంవరం, ప్రేమించు, నీ ప్రేమకై వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపుగా 60 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అలనాటి అందాల తార హీరోయిన్ లయ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ మూవీస్ పై తనకున్న ఇష్టాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది.
కేవలం ఫ్యామిలీ విషయాలు మాత్రమే కాకుండా ట్రెండీ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను ఆక్టటుకుంటుంది. ఇప్పటికే పలు హిట్ సాంగ్స్కు స్టెప్పులేసి అదరగొట్టిన లయ.. తాజాగా మరోసారి నెట్టింట రచ్చ చేసింది. లయ తన కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సిద్దు జొన్నలడ్డ నటించిన రీసెంట్ మూవీ డీజే టిల్లు సినిమాలోని టైటిల్ సాంగ్ డీజే టిల్లుకి.. తల్లీకూతుళ్లు మాస్ డ్యాన్స్ ఇరగదీశారు. నెటిజన్స్ లైకులు కొడుతూ కామెంట్స్ పెడుతున్నారు.
అద్భుతంగా డ్యాన్స్ చేశారని.. సూపర్.. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లయ యూఎస్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే ఓ ఎన్నారై డాక్టర్ను పెళ్లి చేసుకొని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో సెటిలైంది లయ. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఒక బాబు, పాప కూడా ఉన్నారు. ఆ మధ్య రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో తన కూతురు శ్లోకతో కలిసి నటించింది లయ.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…