Actor Krishna : గత కొద్ది రోజులుగా సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ల గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో వీరు సహజీవనం చేస్తున్నారని.. త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అవే నిజమయ్యాయి. వీరిద్దరూ నరేష్ భార్య రమ్య రఘుపతికి మైసూర్లోని ఓ హోటల్లో పట్టుబడ్డారు. తరువాత వీరు నిజం చెప్పక తప్పలేదు. తాము సహజీవనం చేస్తున్నామనే విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు. దీంతో నరేష్, పవిత్ర లోకేష్లపై ఉన్న గౌరవం కాస్తా పోయింది. గతంలో వీరికి ఎంతో పేరు ఉండేది. ఆ ఒక్క సంఘటనతో పేరు మొత్తం పోగొట్టుకున్నారు. పవిత్రను అయితే రెండు సినిమాల నుంచి తొలగించారు.
ఇక ఈ వ్యవహారంలో ముఖ్య పాత్ర అయిన రమ్య రఘుపతి తన భర్త నరేష్పై న్యాయ పోరాటం చేస్తానని తెలియజేసింది. తనను గన్తో బెదిరించి తన నుంచి విడాకులు తీసుకోవాలని చూస్తున్నాడని.. కానీ ఆయనపై న్యాయం కోసం పోరాడుతానని చెప్పింది. అయితే నరేష్ వ్యవహారంపై కృష్ణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఆయన అసలు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ నరేష్ వల్ల కృష్ణ పేరు కూడా బయటకు వచ్చింది. ఆయనకు తెలిసే తాము ఇలా చేస్తున్నామని పవిత్ర లోకేష్ కూడా చెప్పింది. దీంతో కృష్ణ తన పేరు అలా బయటకు రావడాన్ని సహించలేకపోతున్నారట. నరేష్ను ఈ విషయమై ఆయన మందలించారట. అనవసరంగా ఫ్యామిలీ పేరు చెడగొడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారట.
ఓ కార్యక్రమంలో భాగంగా కృష్ణ ఓ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధితో అనేక విషయాలను చర్చించారట. వాటిల్లో నరేష్ వ్యవహారం కూడా ఒకటి ఉందని తెలిసింది. ఈ క్రమంలోనే నరేష్ ఇలా చేస్తాడని అనుకోలేదని ఆయన అన్నారట. పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇవ్వడం వరకు ఓకే. కానీ ఇలా సహజీవనం, ప్రేమ వ్యవహారం అంటే కుటుంబం పరువు మొత్తం పోతుందని ముందుగానే కృష్ణ భయపడ్డారట. పెళ్లి చేసుకుని కలసి ఉండాలని చెప్పారట కూడా. కానీ నరేష్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారట. దీంతో ఇప్పుడు జరగరానిది జరిగిపోయింది. ఫ్యామిలీ బండారం మొత్తం బయట పడింది. ఇదే విషయంపై కృష్ణ అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…