Garuda Puranam : మనకి అంతా మంచే జరగాలని, ఎలాంటి బాధ కూడా లేకుండా హాయిగా, సంతోషంగా ఉండాలని ఉంటుంది. అయితే మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని ఎలా తెలుస్తుంది..? ఎటువంటి సంకేతాలు మనకి కనపడతాయి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం, మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రతి మనిషి జీవితంలో డబ్బుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే మనిషికి విలువ కూడా లేదు. డబ్బులు లేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి. లక్ష్మీ దేవి ధనానికి సంకేతం. లక్ష్మీదేవి కరుణిస్తే, మన దశ తిరిగిపోతుంది. పురాణాల ప్రకారం ఒకరోజు నారద మహర్షి విష్ణుమూర్తిని ఇలా అడిగాడట. తండ్రీ.. మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాలు ఏమైనా ఉన్నాయా అని.. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పారట.
మన ఇంటికి నిత్యం ఆవు వస్తే, కచ్చితంగా లక్ష్మీదేవి కరుణించినట్లే అని అన్నారట. ఆవు వస్తే ఆవు తినడానికి ఏదో ఒకటి పెట్టాలి. ఏదైనా పక్షి కనుక మన ఇంటి ఆవరణలో గూడు కట్టుకుని పిల్లల్ని పెడితే, లక్ష్మీదేవి కటాక్షం కలిగినట్టు దానికి అర్థమట. మూడు బల్లులు కలిపి ఒకే చోట కనిపిస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కనుక మెళకువ వచ్చిన వెంటనే తెలియకుండానే నారాయణ మంత్రాన్ని పఠిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందట.
బల్లి, నక్షత్రం, గులాబీ, శంఖం, ఏనుగు, ముంగిస కలలోకి వచ్చినా కూడా త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని దానికి సంకేతం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఏదైనా తింటున్నట్లు కనపడితే, ధన లాభం కలగబోతోందని దానికి సంకేతం. ఇంట్లో చిన్న పిల్లలు నిత్యం నవ్వుతూ ఆడుతూ ఉంటే కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరలో రాబోతున్నట్లు అర్థం. ఒకవేళ కనుక పిల్లలు ప్రతిదానికి ఏడుస్తూ ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. కష్టాలు కలుగుతాయి. ఇలా ఈ విధంగా మనం అదృష్టం కలగబోతుందని, ధనం మన ఇంటికి రాబోతోందని తెలుసుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…